News February 8, 2025
సిరిసిల్ల: సమస్యలుంటే సంప్రదించాలి

రానున్న ఎండాకాలం, వానకాలం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండటం కోసం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిరిసిల్ల సిస్ పరిపాలన సంచాలకులు విజయేందర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ లైన్స్, ట్రాన్స్ఫార్మర్ నిర్వహణలో భాగంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఆ యొక్క మండల ఏఈలకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.
Similar News
News November 15, 2025
ఇఫ్కో ఛైర్మన్తో సీఎం చర్చలు

విశాఖలో జరుగుతున్న సమ్మిట్లో ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బయో-ఫర్టిలైజర్, బయో-స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాల పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
News November 15, 2025
కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్

జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్క అందించారు. పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి సమస్యలను తీర్చాలని కలెక్టర్ సూచించారు.
News November 15, 2025
రాజకీయాలు, కుటుంబానికి గుడ్బై: లాలూ కూతురు

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.


