News February 8, 2025
సిరిసిల్ల: సమస్యలుంటే సంప్రదించాలి

రానున్న ఎండాకాలం, వానకాలం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండటం కోసం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిరిసిల్ల సిస్ పరిపాలన సంచాలకులు విజయేందర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ లైన్స్, ట్రాన్స్ఫార్మర్ నిర్వహణలో భాగంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఆ యొక్క మండల ఏఈలకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.
Similar News
News October 14, 2025
స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేయిస్తాం: అరుణ కుమారి

రోళ్ల మండలం గిద్దబొమ్మనహళ్లిలో మహిళా సంఘాల సభ్యుల డబ్బును స్వాహా చేసిన యానిమేటర్ తిమ్మరాజు నుంచి రికవరీ చేయిస్తామని డీఆర్డిఏ ప్రాజెక్టు మేనేజర్ అరుణకుమారి తెలిపారు. అందుకు సంబంధించి మంగళవారం గ్రామంలో విచారణ చేపట్టారు. శ్రీనిధి రుణాల వివరాలను పరిశీలించారు. యానిమేటర్ తిమ్మరాజు రూ.2.50 లక్షలు వాడుకున్నట్లు అధికారుల ముందు అంగీకరించారని ఆమె తెలిపారు.
News October 14, 2025
₹212 కోట్లతో అమరావతిలో రాజ్భవన్

AP: అమరావతిలో ₹212కోట్లతో రాజ్భవన్ నిర్మించనున్నారు. దీనికి నిధులు, పాలన అనుమతి ఇస్తూ ప్రభుత్వం GO జారీచేసింది. గవర్నర్ రెసిడెన్స్ కాంప్లెక్స్గా నిర్మించే ఇందులో గవర్నర్ మాన్షన్, దర్బార్ హాల్, ఆఫీస్, 2 గెస్ట్ హౌస్లు, 6 సీనియర్ స్టాఫ్, 12 జూ.స్టాఫ్, 40 సపోర్టింగ్ స్టాఫ్ క్వార్టర్లు, 20 రూముల బ్యారెక్స్, 144 బ్యారెక్ అకామిడేషన్లను ఏర్పాటుచేస్తారు. కాంపౌండ్కు 4 వైపులా సెంట్రీ పోస్టులు ఉంటాయి.
News October 14, 2025
మంచిర్యాల: విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాదు నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.