News July 3, 2024
సిరిసిల్ల: సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లవచ్చు: ఎస్పీ

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన వాహనాలు, సీజ్ చేసిన వాహనాలను యజమానులు సరైన ధృవపత్రాలు చూపించి తీసుకు వెళ్లవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 55 వాహనాలు ఉన్నట్లు తెలిపారు. 6 నెలల లోపు తీసుకవెళ్లకపోతే తర్వాత వేలం వేస్తామన్నారు. ఇతరత్రా సమాచారం కోసం 87126 56428, 90009 10619 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Similar News
News December 4, 2025
కరీంనగర్: మూడు గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవం

కరీంనగర్ జిల్లా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడుచోట్ల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చొప్పదండి మండలం దేశాయిపేటలో తిరుపతి, పెద్దకురుమపల్లిలో స్వరూప ఏకగ్రీవం కాగా, రామడుగు మండలం శ్రీరాములపల్లిలో సుగుణమ్మ సర్పంచ్గా ఖరారయ్యారు. దేశాయిపేటలో సర్పంచ్తో పాటు పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా తెలిపారు.
News December 4, 2025
కరీంనగర్ జిల్లాలో 276 వార్డు సభ్యులు ఏకగ్రీవం

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల ఏకగ్రీవాల సంఖ్య పెరిగింది. చొప్పదండి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని మొత్తం 866 వార్డులకు గాను, 276 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 590 వార్డులకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
News December 4, 2025
KNR: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లాలలో పంచాయతీ ఎన్నికలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తదితర అంశాల పట్ల ఎన్నికల కమిషనర్ రివ్యూ నిర్వహించారు.


