News March 13, 2025

సిరిసిల్ల: 19 లోపు సమావేశాలు పూర్తి చేయాలి: ఎన్నికల అధికారి

image

ఈనెల 19వ తేదీలోపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో నూతన ఓటరు నమోదు, ఓటు బదిలీ, మరణించిన వారి ఓటర్ వివరాల తొలగింపు పూర్తిస్థాయిలో అమలుచేయాలన్నారు. 

Similar News

News February 26, 2026

53 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా: VZM ఎస్పీ

image

మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ గురువారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని ఎస్పీ వెల్లడించారు.

News February 26, 2026

జగిత్యాలలో ఐదు నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సుకు ప్రవేశ పరీక్ష

image

తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు ఉచిత శిక్షణకు ప్రవేశ పరీక్షను మార్చి 1న నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె.రాజ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్ష జగిత్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు గంటముందే గుర్తింపు పత్రాలతో హాజరుకావాలన్నారు.

News February 26, 2026

VZM: ‘ఆ ఉద్యోగులకు గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి’

image

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం ఆదేశించారు. ముస్లిం ఉద్యోగులకు ప్రార్థనల కోసం పనివేళల ముగింపునకు ఒక గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. మసీదులు, ముస్లిం ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, ఫాగింగ్, బ్లీచింగ్ నిర్వహించాలన్నారు.