News February 22, 2025
సిరిసిల్ల: 2464 మంది పిల్లలను గుర్తించాం: DMHO

సిరిసిల్ల జిల్లాలోని పాఠశాలలో కంటి సమస్యలు ఉన్న 2464 మంది విద్యార్థులను గుర్తించామని సిరిసిల్ల DMHO రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఈ విద్యార్థులను మరల కంటి వైద్య నిపుణుల ద్వారా పరీక్ష చేయించి అవసరమైన వారికి కళ్లద్దాలు, కంటి శాస్త్ర చికిత్సలు చేయించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మార్చి 20 వరకు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
Similar News
News November 23, 2025
కరీంనగర్: ఎక్సైజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా శ్రీనివాస్

తెలంగాణ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా మిట్టపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కొంపెల్లి చిరంజీవి ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా రాజేందర్, ఉపాధ్యక్షులుగా వి. రాజశేఖర్ రావు, కోశాధికారిగా తమ్మిశెట్టి వినోద్ ఎన్నికయ్యారు.
News November 23, 2025
కరెంటు షాక్కు గురైన యువకుడు..చికిత్స పొందుతూ మృతి

ముంచుంగిపుట్టు (M) మర్రిపుట్టు గ్రామంలో శ్రీధర్ అనే యువకుడు ఎలక్ట్రిక్ స్టవ్ రిపేర్ చేస్తూ ఆదివారం కరెంట్ షాక్ గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని స్థానికులు ముంచుంగిపుట్టు ఆసుపత్రిలో చేర్చగా..అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి భార్య ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రామకృష్ణ తెలిపారు.
News November 23, 2025
AI ఎఫెక్ట్.. అకౌంట్ లాక్ చేసుకున్న ‘బందనా గర్ల్’

సెల్ఫీ వీడియోతో పాపులారిటీ సంపాదించుకున్న <<18363367>>‘బందనా (తలకు కట్టుకునే వస్త్రం) గర్ల్’<<>> ఎక్స్ అకౌంట్ లాక్ చేసుకున్నారు. ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ తన వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు. తన పర్మిషన్ లేకుండా కొందరు AI ఫొటోలను క్రియేట్ చేసి దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ‘ఈ రోజు మేకప్ బాగా కుదిరింది’ అంటూ ఆమె ఆటోలో తీసుకున్న 2 సెకన్ల వీడియో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే.


