News February 22, 2025
సిరిసిల్ల: 2464 మంది పిల్లలను గుర్తించాం: DMHO

సిరిసిల్ల జిల్లాలోని పాఠశాలలో కంటి సమస్యలు ఉన్న 2464 మంది విద్యార్థులను గుర్తించామని సిరిసిల్ల DMHO రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఈ విద్యార్థులను మరల కంటి వైద్య నిపుణుల ద్వారా పరీక్ష చేయించి అవసరమైన వారికి కళ్లద్దాలు, కంటి శాస్త్ర చికిత్సలు చేయించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మార్చి 20 వరకు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
Similar News
News September 14, 2025
కృష్ణ- వికారాబాద్ రైల్వే లైన్ పనులకు కొత్త ప్రతిపాదనలు

వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సీఎంతో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం సూచించిన కొత్త రైల్వే ప్రాజెక్టు ఎలైన్మెంట్తో DPR రైల్వే బోర్డుకు సమర్పించనున్నారు.
News September 14, 2025
NTR: విషజ్వరాలు.. ప్రజల్లో ఆందోళన.!

NTR జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. మరి కొంతమంది విజయవాడలో ఆసుపత్రిలో చేరగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వారిని పరామర్శించారు. దీనిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
News September 14, 2025
‘వాహనమిత్ర’కు ఎవరు అర్హులంటే?

AP: <<17704079>>వాహనమిత్ర<<>> కింద రూ.15 వేలు పొందాలంటే ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్గా ఉండాలి. గూడ్స్ వాహనాలకు వర్తించదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీలో ఒక్క వాహనానికే పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, IT కట్టేవారు ఉండకూడదు. సిటీల్లో 1000 చ.అ.లకు మించి స్థిరాస్తి ఉన్నవారు అనర్హులు. AP రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లుండాలి. కరెంట్ బిల్లు నెలకు 300యూనిట్లలోపు రావాలి.