News April 2, 2025

సిరిసిల్ల: 6753 మంది విద్యార్థుల హాజరు: DEO

image

సిరిసిల్ల జిల్లాలో ఏడోరోజు జరిగిన పదోతరగతి పరీక్షలకు 6753 మంది విద్యార్థులు హాజరైనట్టు సిరిసిల్ల డీఈవో జనార్దన్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం 6767 మంది విద్యార్థులకు 6753 మంది విద్యార్థులు హాజరైనట్టు ఆయన పేర్కొన్నారు. మొత్తం 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News February 26, 2026

NCERT పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం

image

‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపరిచేలా లోతైన కుట్ర చేసినట్లు అనిపిస్తోందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, NCERT ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించారు. విచారణ సందర్భంగా NCERT అత్యున్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పింది.

News February 26, 2026

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 99 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 99 మంది మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ట్రాఫిక్ విభాగం పరిధిలో 52 కేసులు నమోదు కాగా, సెంట్రల్ జోన్‌లో 22, వెస్ట్ జోన్‌లో 8, ఈస్ట్ జోన్ పరిధిలో 17 కేసులు నమోదయ్యాయి.

News February 26, 2026

ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*24 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.15,730
*22 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.14,472
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720 గా ఉంది.