News March 20, 2025
సిరిసిల్ల: CMR లక్ష్యం పూర్తిచేయాలి: అదనపు కలెక్టర్

బాయిల్డ్, రా రైస్ మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యం పూర్తిచేయాలని సిరిసిల్ల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. జిల్లాలోని బాయిల్డ్, రా రైస్ మిల్లర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా లక్ష్యం పూర్తిచేయాలన్నారు. అలాగే ఆయా రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలను త్వరితగతిన అందజేయాలని స్పష్టం చేశారు.
Similar News
News November 20, 2025
లేటెస్ట్ అప్డేట్స్

* శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. నిన్న స్వామివారిని దర్శించుకున్న 67,121 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.75 కోట్లు
* ఐబొమ్మ రవికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ: నాంపల్లి కోర్టు
* లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 159 పాయింట్లు, నిఫ్టీ 47 పాయింట్లు పైపైకి
* 100వ టెస్టులో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫీకర్ రహీమ్.. ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్గా రికార్డు
News November 20, 2025
వేములవాడ: యువకుడి మృతి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

వేములవాడ డ్రైనేజీలో పడి<<18336834>> ఓ యువకుడు మృతి <<>>చెందిన ఘటనా స్థలాన్ని వేములవాడ పట్టణ పోలీసులు పరిశీలించారు. స్థానిక రెండో బైపాస్ రోడ్డులోని బతుకమ్మ తెప్ప సమీపంలోని డ్రైనేజీలో బుధవారం అర్ధరాత్రి తరువాత ద్విచక్రవాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిని స్థానిక ఉప్పుగడ్డ వీధికి చెందిన గోవిందు అభినవ్(25)గా గుర్తించారు.
News November 20, 2025
HYD: 3వేల మంది అతిథులు.. 2,500 మంది పోలీసులు

వచ్చేనెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని కందుకూర్ మీర్ఖాన్పేటలో జరిగే గ్లోబల్ సమ్మిట్కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నారు. ఈ సమ్మిట్కు దాదాపు 3వేల మంది వీఐపీలు, వారి అసిస్టెంట్లు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక 2,500 మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు.


