News March 20, 2025
సిరిసిల్ల: CMR లక్ష్యం పూర్తిచేయాలి: అదనపు కలెక్టర్

బాయిల్డ్, రా రైస్ మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యం పూర్తిచేయాలని సిరిసిల్ల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. జిల్లాలోని బాయిల్డ్, రా రైస్ మిల్లర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా లక్ష్యం పూర్తిచేయాలన్నారు. అలాగే ఆయా రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలను త్వరితగతిన అందజేయాలని స్పష్టం చేశారు.
Similar News
News September 14, 2025
మీరు ఇలాంటి సబ్బును ఉపయోగిస్తున్నారా?

కొందరు ఏది దొరికితే అదే సబ్బుతో స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల శరీరానికి హానీ కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రత్యేకంగా సబ్బు వాడాలనుకునేవారు వైద్యుడి సలహా తీసుకోవాలి. కొబ్బరి నూనె, షియా బటర్, కలబంద, తేనె వంటి సహజ పదార్థాలతో చేసిన సోప్ వాడాలి. ఇవి చర్మం, ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. రసాయనాలు కలిపిన సబ్బులతో స్నానం చేస్తే చికాకు, ఆందోళన, అనారోగ్యం పాలవుతారు’ అని వారు చెబుతున్నారు.
News September 14, 2025
నిర్మల్: ఓపెన్ స్కూల్స్ అడ్మిషన్ల గడువు పెంపు

2025-26 విద్యా సంవత్సరానికి ఓపెన్ స్కూల్స్ లో ప్రవేశాల గడువును ఈ నెల 18 వరకు పొడిగించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆలస్య రుసుము అవసరం లేదని తెలిపారు. 19, 20 తేదీలలో ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
News September 14, 2025
NTR స్మృతివనంలో విగ్రహం ఏర్పాటుపై సమీక్ష

AP: అమరావతిలోని నీరుకొండ వద్ద నిర్మించే NTR స్మృతివనం తెలుగువారి ఆత్మగౌరవం-ఆత్మవిశ్వాసం కలగలిపి వైభవంగా ఉండాలని CM చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టులో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, ప్రాచీన చరిత్రకు పెద్దపీట వేయాలన్నారు. NTR విగ్రహం ఏర్పాటుపై సమీక్షించారు. ఇందులో అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు వంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు.