News March 9, 2025

సిరిసిల్ల SP ఫుల్ డీటెయిల్స్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా SPగా నియామకమైన మహేష్ బాబా సాహెబ్ గీతే మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జన్మించారు. ఈయన అగ్రికల్చర్ BScలో డిగ్రీ పట్టాపొందారు. ఎలాంటి కోచింగ్ లేకుండానిరంతర సాధనతో 2020లో IPSకు ఎంపికయ్యారు. మొదట చొప్పదండి ఠాణాలో శిక్షణ ఐపీఎస్ విధులు నిర్వహించారు. తర్వాత ఏటూరు నాగారం ASPగా పనిచేశారు. ప్రస్తుతం ములుగు జిల్లా OSDగా బాధ్యతలు నిర్వహిస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా వచ్చారు.

Similar News

News March 10, 2025

INDIA WIN.. బండి సంజయ్ సంబరాలు

image

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కప్ సాధించిన టీమ్ ఇండియాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. టీమ్ఇండియా..అన్ స్టాపబుల్, అన్ బీటబుల్, అన్ ఫర్గెటబుల్.. కంగ్రాట్యులేషన్స్ టు ది మెన్ ఇన్ బ్లూ..ఫర్ మేకింగ్ ది నేషన్ ప్రౌడ్ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భారత జట్టు ఛాంపియన్స్‌గా ఆవిర్భవించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

News March 10, 2025

కొత్తగూడెం: కాల్వలో పడి డిగ్రీ విద్యార్థి మృతి

image

మున్నేటిలో పడి డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లికి చెందని మహేశ్ ఖమ్మంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 8న స్నేహితులతో కలిసి కాల్వ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదైంది.

News March 10, 2025

వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తాం: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు నానాబల్ల గణేశ్వరరావును ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను మధ్యవర్తిగా బెట్టింగ్ లావాదేవీలు జరపుతుంటాడని పేర్కొన్నారు. వీరి ద్వారా ఇంకొందరు బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.

error: Content is protected !!