News March 9, 2025
సిరిసిల్ల SP ఫుల్ డీటెయిల్స్

రాజన్న సిరిసిల్ల జిల్లా SPగా నియామకమైన మహేష్ బాబా సాహెబ్ గీతే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జన్మించారు. ఈయన అగ్రికల్చర్ BScలో డిగ్రీ పట్టాపొందారు. ఎలాంటి కోచింగ్ లేకుండానిరంతర సాధనతో 2020లో IPSకు ఎంపికయ్యారు. మొదట చొప్పదండి ఠాణాలో శిక్షణ ఐపీఎస్ విధులు నిర్వహించారు. తర్వాత ఏటూరు నాగారం ASPగా పనిచేశారు. ప్రస్తుతం ములుగు జిల్లా OSDగా బాధ్యతలు నిర్వహిస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా వచ్చారు.
Similar News
News January 18, 2026
డ్రంక్ అండ్ డ్రైవ్పై జగిత్యాల జిల్లా పోలీసుల కఠిన చర్యలు

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. Arrive Alive రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరో రోజు Drunk and Drive – Zero Tolerance Day నిర్వహించారు. పోలీసులు బ్రెత్ అనలైజర్లతో వాహనదారులను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.
News January 18, 2026
అనకాపల్లి: విషాదం.. పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య

అనకాపల్లి పరిధిలోగల శారదానదిలోకి దూకి వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. అనకాపల్లి సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన భారతి(19)కి వివాహం జరిగి ఏడాది అయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 18, 2026
ట్రంప్ వద్దకు నోబెల్ శాంతి.. స్పందించిన కమిటీ

ట్రంప్నకు వెనిజులాకు చెందిన మచాడో తన <<18868941>>శాంతి<<>> బహుమతిని ఇవ్వడంపై భిన్నమైన స్పందన రాగా తాజాగా నోబెల్ కమిటీ స్పందించింది. మెడల్ ఎవరి వద్ద ఉన్నా తాము ప్రకటించిన విజేతలో మార్పు ఉండదని తెలిపింది. విజేతలు తీసుకునే నిర్ణయాలపై అవార్డు కమిటీ ఎలాంటి కామెంట్లు చేయబోదని పేర్కొంది. మెడల్ను అమ్మడం, దానం చేయడం వంటి వాటిపై పరిమితులు లేవని తెలిపింది. గతంలోనూ పలువురు మెడల్స్ను డొనేట్/అమ్మడం చేసినట్లు వెల్లడించింది.


