News March 11, 2025
సిరిసిల్ల: TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ మృతి

సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ టి.గంగారం(55) లిఫ్ట్ వచ్చిందనుకుని లోపలికి అడుగేసి ప్రమాదవశాత్తు కిందపడి సోమవారం రాత్రి చనిపోయారు. స్నేహితుడు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ను కలిసేందుకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్పై పడి మృతిచెందారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామం ఆయన స్వస్థలం.
Similar News
News March 16, 2025
తంగళ్ళపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముందస్తు అరెస్ట్

కాంగ్రెస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోనీని సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాట్ల మధు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ ఒకరిపై ఒకరు సవాల్ విసురుకున్న విషయం తెలిసిందే. సవాల్ కోసం సిరిసిల్లకు చేరుకున్న టోనీని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. శాంతి భద్రతల దృష్ట్యా తంగళ్లపల్లిలో మధును, సిరిసిల్లలో టోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
News March 16, 2025
పెద్దపల్లి: 30న అఖిల భారత యాదవ మహాసభ

ఈనెల 30వ తేదీన అఖిల భారత యాదవ మహాసభ నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు శనివారం వెల్లడించారు. ఈ మేరకు పెద్దపల్లి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మహాసభలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పురస్కారాల కోసం ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
News March 16, 2025
టెస్లా కోసం ప్రభుత్వం ప్రయత్నాలు.. భూముల పరిశీలన

AP: అమెరికాకు చెందిన ఆటోమోటివ్ కంపెనీ టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి జిల్లా మేనకూరు, సత్యవేడులోని శ్రీసిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలో భూములను పరిశీలిస్తున్నారు. ఈ మూడు ప్రాంతాలు చెన్నైకి 120 కి.మీ దూరంలో ఉండటం, విమానాశ్రయాలు, పోర్టులు, నేషనల్ హైవేలు దగ్గరగా ఉండటం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.