News February 12, 2025
సిర్గాపూర్: క్యాన్సర్తో యువకుడి మృతి

సిర్గాపూర్ మండలం జమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని జీవులనాయక్ తండాకు చెందిన యువరైతు వడిత్య శ్రీనివాస్(29) క్యాన్సర్ వ్యాధితో మృతి చెందాడు. యువకుడు గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. బుధవారం ఉదయం శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో మరణించినట్లు చెప్పారు. కాగా, మృతుడికి ఏడాది కిందటే పెళ్లైనట్లు సమాచారం. యువకుడి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 26, 2026
‘ఏ తల్లి కన్న బిడ్డో.. ఇంకా జాడ లేదు’

బొమ్మనహాల్ మండలం నేమకల్లులో గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లిన ఘటనలో ఆ బిడ్డ ఎవరనే విషయం 24 గంటలైనా తేలలేదు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి మదర్ మిల్క్ న్యూట్రీషన్ సెంటర్లో వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఉన్నతాధికారులు ఎవరూ అక్కడికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న దాఖలాలు లేవు. ICDS, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదని తెలుస్తోంది.
News February 26, 2026
అమరావతికి భారీగా నిధులు

అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.1,400 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి (సీఆర్డీఏ) శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండు, మూడో త్రైమాసికాలకు గాను ఈ నిధులను కేటాయించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాల కింద ఏపీ సీఆర్డీఏ పీడీ ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 26, 2026
తిరుపతి: ఎగ్జాం సెంటర్ వద్దే హాల్ టికెట్లు

తిరుపతి SVU పరిధిలో డిగ్రీ మొదటి, రెండో, మూడో సంవత్సర ఇయర్ ప్యాటర్న్(వార్షిక విధానం) పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు హాల్ టికెట్లు తీసుకోని వారు పరీక్ష సమయానికి ముందుగా ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు ఎగ్జాం సెంటర్ వద్దే పొందవచ్చని అధికారుల సూచించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


