News March 5, 2025
సిర్పూర్(యు): గంజాయి సాగు చేస్తున్న వ్యక్తికి ఏడేళ్ల జైలు

గంజాయి సాగు చేస్తున్న కేసులో వ్యక్తికి 7 సంవత్సరాల జైలు శిక్ష రూ.50వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పు ఇచ్చారు. సిర్పూర్(యు) ఎస్ఐ రామకృష్ణ కథనం ప్రకారం.. 24.10.2021న నమ్మదగిన సమాచారం మేరకు మధురతండాకు చెందిన భానుదాస్(29) గంజాయి సాగు చేస్తుండగా పట్టుకున్నామన్నారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News November 28, 2025
నాణ్యమైన విద్య అందేలా చూడండి: డీఈఓ చైతన్య జైని

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలల HMలతో డీఈఓ చైతన్య జైని గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలను వారికి తప్పక అందించేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని HMలను డీఈఓ ఆదేశించారు.
News November 28, 2025
నాణ్యమైన విద్య అందేలా చూడండి: డీఈఓ చైతన్య జైని

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలల HMలతో డీఈఓ చైతన్య జైని గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలను వారికి తప్పక అందించేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని HMలను డీఈఓ ఆదేశించారు.
News November 28, 2025
విజయవాడ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సకు ‘లినాక్’ పరికరం

విజయవాడ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ వైద్య సేవలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా లీనియర్ యాక్సిలరేటర్ పరికరాన్ని అందుబాటులోనికి తెచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంపీ, ఇతర అధికారులతో కలిసి మంత్రి ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు. ఈ అత్యాధునిక ‘లినాక్’ పరికరం సమకూర్చేందుకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు.


