News March 18, 2025
సిర్పూర్(యు): గంజాయి సాగు.. మూడేళ్ల జైలు

గంజాయి సాగు చేస్తున్న వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మండలంలోని మధుర తండాకు చెందిన కట్కవార్ రావు సింగ్ 24/10/2021న పొలంలో గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డాడు. కేసు విచారణలో భాగంగా సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ సదరు వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు చెప్పారు.
Similar News
News March 19, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔పలుచోట్ల ఇఫ్తార్ విందు..పాల్గొన్న నేతలు
✔BC,SC బిల్లులకు ఆమోదం.. జిల్లా నేతల సంబరాలు
✔సిద్ధం.. 21 నుండి టెన్త్ పరీక్షలు:MEOలు
✔పరిగి: బొలోరో వాహనాన్ని ఢీ కొట్టిన కారు
✔VKB: ఆర్టీసీ డిపోకు 16 కొత్త బస్సులు
✔VKB: 21 నుంచి ఏప్రిల్ 3 వరకు పది పరీక్షలు: కలెక్టర్
✔ఇంటర్ పరీక్షలకు 178 మంది గైర్హాజరు
✔VKB: ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ తరగతులు ప్రారంభం
News March 19, 2025
నిద్రపోయే ముందు నీరు తాగుతున్నారా?

రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం బాగా జీర్ణం అవడంతో పాటు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తదితర సమస్యలు తొలగిపోతాయి. పొట్ట తేలికగా మారిన భావన కలుగుతుంది. వీటితో పాటు నాడీ వ్యవస్థ రిలాక్స్ అయి ఒత్తిడి తగ్గుతుంది. యాంగ్జైటీ వంటి సమస్యలు దూరమై హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి గోరువెచ్చని నీరు చక్కటి పరిష్కారం.
News March 19, 2025
తూ.గో. జిల్లాలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

AP: తూ.గో. జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ, వన్యప్రాణి సంరక్షణపై అటవీ శాఖ ఉద్యోగులు లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణ అక్కడ ఉండాలని Dy.CM పవన్ అన్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా తాజాగా దివాన్ చెరువు ప్రాంతంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.