News March 18, 2025

సిర్పూర్(యు): గంజాయి సాగు.. మూడేళ్ల జైలు

image

గంజాయి సాగు చేస్తున్న వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మండలంలోని మధుర తండాకు చెందిన కట్కవార్ రావు సింగ్ 24/10/2021న పొలంలో గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డాడు. కేసు విచారణలో భాగంగా సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ సదరు వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు చెప్పారు.

Similar News

News March 18, 2025

నల్గొండ: పనుల ప్రారంభం వేగవంతం చేయాలి:  కలెక్టర్ 

image

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో నల్గొండ బైపాస్ జాతీయ రహదారి 565కు సంబంధించి అవార్డు పాస్ చేయడం, పనుల ప్రారంభం వంటివి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో నేషనల్ హైవే 565 నల్గొండ బైపాస్‌పై జాతీయ రహదారుల సంస్థ అధికారులు ,ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం అయ్యారు. 

News March 18, 2025

NTR: ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాలపై ప్ర‌త్యేక దృష్టి: కలెక్టర్ 

image

అర్హులైన వారికి ఇబ్బంది లేకుండా ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాల పంపిణీకి అధికారులు ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో అట‌వీ శాఖ స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాల పంపిణీ, హ‌రిత విస్తీర్ణం పెంపు, ఆక్ర‌మ‌ణ‌ల నియంత్ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించారు. క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు ప‌క‌డ్బందీగా అమ‌ల‌య్యేలా చూడాల‌న్నారు.

News March 18, 2025

చిత్తూరులో భారీగా పోలీసుల బదిలీ

image

చిత్తూరు జిల్లా పరిధిలోని పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. పోలీస్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 219 మంది సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా.. మరికొందరిని వీఆర్‌కు పంపించారు. పుంగనూరులో టీడీపీ నాయకుడి హత్య నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీసులను బదిలీ చేసినట్లు సమాచారం.

error: Content is protected !!