News January 27, 2025
సిర్పూర్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు

సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుపై కాగజ్నగర్ పట్టణవాసులు సీఐ రాజేంద్రప్రసాద్ కు ఆదివారం ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించకుండా అగౌరవపరిచారన్నారు. అధికారిక నివాసంపై ఉన్న జాతీయ జెండా రంగు తేలినా మార్చకుండా అవమానపరిచారని తెలిపారు. జాతీయ జెండాను అగౌరవపరిచినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News September 16, 2025
MBNR: SP సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

MBNRలోని పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఈ రోజు నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి అధికారులకు కీలక సూచనలు చేశారు.
✒CC కెమెరాల నిఘా పెంచి, పని చేయని కెమెరాలను వెంటనే రిపేర్ చేయాలి.
✒పెండింగ్లో ఉన్న అరెస్టులు, FSL రిపోర్టులు పూర్తి చేయాలి.
✒ప్రజావాణి.. వెంటనే చర్యలు తీసుకోవాలి.
✒POCSO కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
✒వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
News September 16, 2025
KNR: శాతవాహన డిగ్రీ ఇన్స్టంట్ ఎగ్జామ్ రేపే

డిగ్రీ ఆఖరు సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిలైన విద్యార్థుల కోసం ఇన్స్టంట్ పరీక్ష SEP 17న (రేపు) ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డి. సురేష్ కుమార్ తెలిపారు. 5వ సెమిస్టర్ ఎగ్జామ్ ఉ.9 గం.ల నుంచి మ.12 గం.ల వరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ కళాశాలలో జరుగుతాయని, 6వ సెమిస్టర్ ఎగ్జామ్ మ.2 గం.ల నుంచి సా.5 గం.ల వరకు శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో జరుగుతాయని చెప్పారు.
News September 16, 2025
నెల్లూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతుల ఇబ్బందులు!

జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోతలు మొదలైపోయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర పుట్టి రూ.20,187 ఉండగా మిల్లర్లు రూ.13–15 వేలకే కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు పంటను దెబ్బతీయగా ధరలు పడిపోతాయనే ఆందోళన రైతుల్లో ఉంది. గతంలో పుట్టి రూ.24 వేలు ఉండగా, ఇప్పుడు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నామని రైతులు వాపోతున్నారు.