News March 7, 2025
సిర్పూర్ (టి): వంతెన పైనుంచి నదిలో పడి వ్యక్తి మృతి

మహారాష్ట్రలోని పొడ్స గ్రామం మధ్యలోని నది వంతెన పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ కమలాకర్ వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలం ఇస్గాంకు చెందిన ప్రశాంత్ (39) వ్యాపార నిమిత్తం మహారాష్ట్రలోని ధాబా గ్రామానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News March 20, 2025
వికారాబాద్: పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు

వికారాబాద్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 2వ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 12,903మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,450 మంది బాలురు, 6,453 మంది బాలికలు ఉన్నారు. 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
News March 20, 2025
మంచిర్యాల: ఆ ఉపాధ్యాయుడే కీచకుడు

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల కీచకంగా మారుతున్నారు. మంచిర్యాల గర్ల్స్ హై స్కూల్లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టు అయ్యాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ నిర్మల్(D) నర్సాపూర్ (జి)లో గణిత ఉపాధ్యాయుడు, సాయికుంట ఆశ్రమ పాఠశాల, భీమిని పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
News March 20, 2025
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి..

కర్లపాలెం మండలం యాజలికి చెందిన ప్రవీణ్ కుమార్(15) ఈతకు వెళ్లి బుధవారం మృతి చెందాడు. ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. యాజలిలోని పంట పొలాల్లో 20 అడుగుల లోతు ఉన్న ఓ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలిపారు. మరో ఘటనలో పిట్టలవానిపాలెం మండలం గోకరాజునల్లి బోయినవారిపాలెంలో విద్యుత్ షాక్ తగిలి కలుసు బేబీ(6) అనే బాలిక మృతి చెందింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.