News March 24, 2025
సిలిండర్ పూర్తిగా ఆఫ్ చేయకపోవడంతోనే పేలుడు..

కర్నూలు జిల్లా ఆలూరు మం. కురవల్లి గ్రామంలో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. సిలిండర్ పూర్తిగా ఆఫ్ చేయకపోవడంతో గ్యాస్ లీకైంది. ఉదయం లైటు స్విచ్ వేయగానే ఒక్కసారిగా సిలిండర్ పేలిందని ఎస్సై మహబూబ్ బాషా తెలిపారు. ప్రమాదంలో దంపతులు గురుస్వామి, గాయత్రి, వారి కుమారుడు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
Similar News
News October 29, 2025
చెరుకూరులో అంతర్ రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం

వాజేడు(మం) చెరుకూరులో అంతర్ రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ జీ ప్రారంభించారు. ములుగు జిల్లాకు ఆనుకొని ఉన్న ఛత్తీష్గడ్ రాష్ట్రం నుంచి ధాన్యం మన జిల్లాలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దళారులు తెచ్చి మద్దతు ధర, బోనస్ పొందకుండా మన రాష్ట్ర రైతులకు మాత్రమే లాభం చేకూరాలన్నారు.
News October 29, 2025
ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖల సమావేశం

భూపాలపల్లి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ.సునీల్కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉద్యాన శాఖ తరపున అమలవుతున్న వివిధ పథకాల ప్రయోజనాలు, భౌతిక లక్ష్యాలు, రైతులకు చేరే మద్దతు, అలాగే శాఖల సమన్వయం ద్వారా అమలులో వేగం పెరగాలని సూచించారు.
News October 29, 2025
జనగామ: భారీ వర్షాలు.. కలెక్టరేట్లో కంట్రోల్ ఏర్పాటు!

భారీ వర్షాల నేపథ్యంలో జనగామ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా వెల్లడించారు. భారీ వరదలు, రహదారుల ధ్వంసం, చెట్లు విరిగిపడడం, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9052308621లో సంప్రదించాలని కోరారు. సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు.


