News April 10, 2025
సి.బెలగల్: ‘రీ సర్వేలో లోపాలు లేకుండా ఉండాలి’

పైలెట్ గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వేలో లోపాలు లేకుండా సమగ్రంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సర్వే, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం రీసర్వే పైలట్ ప్రాజెక్ట్గా ఎంపికైన సి.బెలగల్ మండల కేంద్రంలోని గ్రామ పొలాల్లో జరుగుతున్న రీ సర్వే పని తీరును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రీ సర్వేకి సంబంధించి గ్రౌండ్ ట్రూతింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.
Similar News
News April 23, 2025
10th Results: 25వ స్థానంలో కర్నూలు జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 31,185 మంది పరీక్ష రాయగా 20,584 మంది పాసయ్యారు. 16,326 మంది బాలురులో 9,854 మంది, 14,859 మంది బాలికలు పరీక్ష రాయగా 10,730 మంది పాసయ్యారు. 66.01 పాస్ పర్సంటైజ్తో కర్నూలు జిల్లా 25వ స్థానంలో నిలిచింది.
News April 23, 2025
కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంగళవారం కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఉదయం 9 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మరోవైపు భగ్గుమంటున్న ఎండల వేళ శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
News April 23, 2025
నేడే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.