News March 2, 2025

సి. బెళగల్ : చెట్టు విరిగి పడి బాలిక మృతి

image

సి.బెళగల్ మండలం పోలకల్ జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం చెట్టు విరిగిన పడి 8వ తరగతి విద్యార్థిని శ్రీలేఖ గాయపడిన విషయం తెలిసిందే. కాగా బాలిక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఇది దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి విద్యాశాఖ రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని NUSI జిల్లా అధ్యక్షుడు వీరేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

Similar News

News September 13, 2025

నేడు మణిపుర్‌లో ప్రధాని మోదీ పర్యటన

image

ప్రధాని మోదీ ఇవాళ మణిపుర్‌లో పర్యటించనున్నారు. 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైనప్పటి నుంచి ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ.1,200కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంఫాల్, చురాచాంద్‌పూర్ ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో ప్రధాని సమావేశం కానున్నారు. అనంతరం మణిపుర్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి.

News September 13, 2025

MNCL: ఈనెల 22న PLR బోనస్‌పై జేబీసీసీఐ సమావేశం

image

బొగ్గు పరిశ్రమలోని కార్మికులకు దీపావళి పండుగ సందర్భంగా అందించే పనితీరు ఆధారిత రివార్డు (PLR) చెల్లింపుపై ఈనెల 22న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో జేబీసీసీఐ సమావేశం జరగనుంది. ఈ మేరకు కోల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌతమ్ బెనర్జీ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ గౌతమ్ పొట్రుతో పాటు దేశంలోని బొగ్గు పరిశ్రమల డైరెక్టర్లు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటారు.

News September 13, 2025

వరంగల్ మీదుగా వెళ్లే వందే భారత్ రాకపోకల్లో స్వల్ప మార్పులు

image

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకల్లో స్వల్ప మార్పులు చేశారు. సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య వరంగల్ మీదుగా ప్రస్తుతం గురువారం మినహా మిగతా ఆరు రోజులు నడుస్తున్న ఈ రైళ్లు డిసెంబర్ 5 నుంచి గురువారానికి బదులుగా సోమవారం ట్రిప్పులను రద్దు చేశారు. ఇకనుంచి సోమవారం మినహా మిగిలిన ఆరు రోజులు రాకపోకలు సాగిస్తాయని దక్షిణమధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి ఎ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.