News March 2, 2025

సి. బెళగల్ : చెట్టు విరిగి పడి బాలిక మృతి

image

సి.బెళగల్ మండలం పోలకల్ జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం చెట్టు విరిగిన పడి 8వ తరగతి విద్యార్థిని శ్రీలేఖ గాయపడిన విషయం తెలిసిందే. కాగా బాలిక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఇది దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి విద్యాశాఖ రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని NUSI జిల్లా అధ్యక్షుడు వీరేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

Similar News

News March 24, 2025

పెనుమంట్ర: 5 నెలల్లో ఐదుగురు మృత్యువాత

image

పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్ నుంచి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వరకు ఉన్న రహదారిపై ఐదు నెలల వ్యవధిలో ఐదుగురు వాహనదారులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రాంతం ఇరుకుగా మారడంతో పాటు భారీ వాహనాల అతివేగం ప్రమాదాలకు కారణమని స్థానికులు అంటున్నారు. నిత్యం ఈ దారిలో ఏదొక వాహన ప్రమాదం జరగడం పరిపాటిగా మారిందంటున్నారు. రహదారి వెడల్పు చేస్తేనే కానీ ప్రమాదాలు తగ్గవని వాహనదారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

News March 24, 2025

సైబరాబాద్‌ డ్రంక్ అండ్ డ్రైవ్ REPORT

image

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 389 మంది పట్టుబడ్డారు. వీరిలో 315 మంది ద్విచక్ర వాహనదారులు, 59 మంది ఫోర్ వీలర్లు, 13 మంది త్రీవీలర్లు, 2 మంది భారీ వాహనదారులు ఉన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 61 మంది పట్టుబడ్డారు. కాగా, వారిలో 160 మంది 31-40 ఏళ్ల వయసులోపు ఉన్నారు.

News March 24, 2025

సిరిసిల్ల: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

సిరిసిల్ల పట్టణంలోని విజ్ఞాన వర్ధిని పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, పరీక్ష జరుగుతున్న సరళిని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరీక్ష కేంద్రం పరిసరాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారని అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!