News March 17, 2025
సీఎంని తిట్టడం అప్రజాస్వామికం: జస్టిస్ సుదర్శన్ రెడ్డి

HYD: ఇటీవల మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఎడిటర్ గిల్డ్స్ ఎలా ఖండిస్తుందని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఆమె పెట్టిన కంటెంట్ను పరిశీలించారా, మీడియాలో అలాంటి భాష వాడొచ్చా అని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో లేని ముఖ్యమంత్రి కుటుంబంలోని మహిళలను బూతులు తిట్టడం స్వేచ్ఛ కిందికి రాదన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు పాశం యాదగిరి, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డిలున్నారు.
Similar News
News March 17, 2025
రాజేంద్రనగర్ NIRDPRలో రూ. లక్ష జీతంతో ఉద్యోగం

రాజేంద్రనగర్లోని NIRDPRలో కాంట్రాక్ట్ బేసిస్ కింద 33 పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీటెక్, PG, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు మాత్రమే అర్హులు. వయస్సు 60 ఏళ్లకు మించకూడదు. జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్కు రూ. 1,00,000, ప్రాజెక్ట్ ఆఫీసర్కు రూ. 1,40,000, ప్రోగ్రాం ఆఫీసర్రు రూ. 1,90,000 జీతం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు మార్చి 19 చివరి తేదీ.
SHARE IT
News March 17, 2025
HYD: ఓయూ బంద్కు ABVP పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు ఇక మీదట అనుమతి లేదని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది నియంతృత్వ పోకడ అంటూ ABVP మండిపడుతోంది. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీ బంద్కు నాయకులు పిలుపునిచ్చారు. రిక్రూట్మెంట్, నిధుల కొరత, ఆహార నాణ్యత అంశాలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారనే నెపంతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.
News March 17, 2025
OUలో పీహెచ్డీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీల కేటగిరి 2 పీహెచ్డీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు గడువును పొడిగించినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ. 2000 అపరాధ రుసుంతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.