News January 31, 2025
సీఎంను కలిసిన MLA కోట్ల

విజయవాడలో CM చంద్రబాబును గురువారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజవర్గంలో రాజకీయ పరిస్థితులు, జరుగుతున్న అభివృద్ధి గురించి సీఎంకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకెళ్లాలని సీఎం సూచించారన్నారు.
Similar News
News November 27, 2025
విశాఖ: రూ.1,12,03,480 ప్రాపర్టీ రికవరీ

విశాఖ సీపీ కార్యాలయంలో గురువారం ప్రాపర్టీ రికవరీ మేళా నిర్వహించారు. అక్టోబర్ నెలలో జరిగిన రికవరీ మేళాలో విశాఖ కమీషనరేట్ పరిధిలో నమోదైన కేసులను పోలీసులు చేధించి రూ.1,12,03,480 సొత్తును రికవరీ చేశారు. ఆ ప్రాపర్టీను సీపీ శంఖబ్రత బాగ్చి బాధితులకు అందించారు. మొత్తం 838.331 గ్రాముల బంగారం, 505 మొబైల్ ఫోన్స్, 22 ద్విచక్ర వాహనాలు, రూ.3,10,500 రికవరీ చేశారు. విశాఖ సీపీ ప్రతి నెల ఈ మేళా నిర్వస్తున్నారు.
News November 27, 2025
వరంగల్: పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు

సెప్టెంబర్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్తోపాటు ఇటీవల నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమంలో అత్యధిక కేసులను రాజీమార్గంలో ముగించినందుకు కృషి చేసిన పోలీస్ అధికారులను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు అభినందించారు. ఈ మేరకు ఆయన చేతుల మీదుగా వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ప్రశంసాపత్రాలను అందజేశారు.
News November 27, 2025
టీమ్ ఇండియా సెలక్షన్పై CV ఆనంద్ అసంతృప్తి

భారత క్రికెట్ పరిస్థితిపై TG హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో భారత్లో ప్రత్యర్థులు గెలవడం అరుదుగా జరిగేదని.. ప్రస్తుతం భారత ప్లేయర్లు స్వదేశంలోనే స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోలేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రంజీలు ఆడకపోవడం, IPL ఆధారంగా సెలక్షన్ జరగడం దీనికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. రంజీలో రాణిస్తున్న ఆటగాళ్లను పక్కనబెట్టడం సెలక్షన్లో పక్షపాతానికి నిదర్శనమన్నారు.


