News January 31, 2025
సీఎంను కలిసిన MLA కోట్ల

విజయవాడలో CM చంద్రబాబును గురువారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజవర్గంలో రాజకీయ పరిస్థితులు, జరుగుతున్న అభివృద్ధి గురించి సీఎంకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకెళ్లాలని సీఎం సూచించారన్నారు.
Similar News
News December 10, 2025
వ్యవసాయంలో విత్తనశుద్ధితో ప్రయోజనాలు

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.
News December 10, 2025
వారికి త్వరగా పరిహారం అందాలి: D-HC

ఇండిగో ఫ్లైట్ల రద్దుతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు వీలైనంత త్వరగా పరిహారం అందించాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ‘ఎయిర్పోర్టుల్లో పడిగాపులున్న ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ, DGCA, ఇండిగో వీలైనంత త్వరగా పరిహారం అందిస్తాయని ఆశిస్తున్నాం’ అని ఇవాళ విచారణలో పేర్కొంది. అంతకుమందు కేంద్రం సరిగా స్పందించకే ప్రజలు ఇబ్బంది పడ్డారని <<18521287>>HC ఏకిపారేసిన<<>> విషయం తెలిసిందే.
News December 10, 2025
100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.


