News October 15, 2024

సీఎం, కేంద్ర మంత్రిని కలిసిన కొండా సురేఖ

image

వికారాబాద్ జిల్లా దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ కమ్యూనికేషన్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి కొండా సురేఖ స్వాగతం పలికారు. అనంతరం పలు అంశాలపై నేతలు చర్చించారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఉన్నారు.

Similar News

News January 4, 2026

హాల్టికెట్లలో మార్పులుంటే చేసుకోవచ్చు: డీఐఈవో

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్టికెట్లలో ఏవైనా మార్పులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వరంగల్ డీఐఈవో డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్నెట్ లో హాల్టిక్కెట్ల ప్రివ్యూను బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నమూనా హాల్ టికెట్లలో పరిశీలించి ఏవేని మార్పులున్నట్లయితే ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు. పరీక్షల నిర్వహణ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు.

News January 4, 2026

WGL: మున్సిపల్ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ..!

image

మున్సిపల్ ఎన్నికల పోరు సిద్ధమవుతోందన్న సంకేతాలు జిల్లాలో తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితా, వార్డుల విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు పెద్ద సవాలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎలా ఉంటాయో..? అనే చర్చ జరుగుతోంది.

News January 4, 2026

వరంగల్ జిల్లాలో యూరియా కొరత లేదట..?

image

జిల్లాలో యూరియా కొరత లేదని, యాసంగి పంటలకు సరిపడా నిల్వలు ఉన్నాయని WGL జిల్లా వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు. ఇప్పటి వరకు 1,11,435 ఎకరాల్లో సాగు జరగగా 3,56,392 బస్తాల యూరియా సరఫరా చేశామన్నారు. పీఏసీఎస్‌లు, డీలర్ల వద్ద 890 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 3,300 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. రైతులు అవసరానికే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు. కానీ రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.