News March 18, 2025

సీఎం కేసీఆర్‌ను కలిసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే

image

మాజీ సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సోమవారం కలిశారు. రజతోత్సవ వేడుకల సందర్భంగా ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసిన నాటి టీఆర్ఎస్ రైతు నాగలి గులాబీ జెండాను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్‌కు అందజేసి, ఆనాటి పార్లమెంటరీ ఉద్యమ పంథా పోరాట జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Similar News

News December 18, 2025

మంచిర్యాలలో ఎక్కువ.. ఆసిఫాబాద్‌లో తక్కువ!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 87.78 శాతం పోలింగ్‌తో మంచిర్యాల జిల్లా ముందు వరుసలో నిలిచింది. అదిలాబాద్ జిల్లాలో 86.94%, నిర్మల్ జిల్లాలో 84.99%, ఆసిఫాబాద్ జిల్లాలో 83.32%, పోలింగ్ నమోదు అయ్యింది. 20 మండలాల్లో జరిగిన 3వ విడతలో 3,97,259 ఓటర్లుండగా, వారిలో 3.34 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News December 18, 2025

NZB: మూడు దశల్లో మహిళలే ఎక్కువ

image

నిజామాబాద్ జిల్లాలో మూడు దశలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటు వేశారు. జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లో 7,88,356 మంది ఓటర్లు ఉండగా 6,15,257 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 3,49,574 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 2,65,679 మంది, ఇతరులు నలుగురు ఓటేశారు.

News December 18, 2025

తూ.గో: ముచ్చటగా మూడు పదవులు

image

తబ.గో జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరికి ముచ్చటగా 3 పదవులు వరించాయి. రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, రుడా ఛైర్మన్‌గా ఉన్న ఆయనకు ఇప్పుడు కొత్తగా జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. 3 పదవుల ముచ్చట మూన్నాళ్లకే పరిమితం అవుతుందా ? కొనసాగిస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. రుడా ఛైర్మన్ పదవిని వేరొకరికి కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.