News April 5, 2025

సీఎం చంద్రబాబు ముప్పాళ్లలో శంకుస్థాపన చేసిన పనుల వివరాలివే(2/2)

image

నేడు సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని గురుకులాలు, SC హాస్టళ్లలో స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్(గ్రామీణ్‌) కింద క‌మ్యూనిటీ శానిట‌రీ కాంప్లెక్స్‌లకై రూ.58.14 కోట్లతో చేపట్టనున్న 1,938 పనులకు, అలాగే 153 ప్రభుత్వ విద్యాసంస్థలలో రూ.5.18 కోట్లతో PM- AJAY పథకం కింద ఆర్‌వో ప్లాంట్ల ద్వారా తాగునీటి స‌ర‌ఫ‌రా పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రజాప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. 

Similar News

News April 16, 2025

గుంటూరు: కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రి.. అరెస్ట్

image

సొంత కూతురిపై లైంగిక దాడికి ఒడిగట్టిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులోకి తీసుకున్నారు. నిందితుడిని కొలకలూరు కాలువ కట్టవద్ద గుర్తించి, రూరల్ సీఐ ఉమేశ్ చంద్ర, ఎస్ఐ కట్టా ఆనంద్‌ల బృందం మంగళవారం అదుపులోకి తీసుకుంది. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

News April 16, 2025

రామగిరి ఎస్ఐని దూషించిన వారిపై కేసు

image

శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో దూషించిన వారిపై కేసు నమోదైంది. ఈ నెల 13న సుధాకర్ చేసిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టనున్నారు.

News April 16, 2025

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

image

పార్వతీపురం-సీతానగరం మధ్య ఇంటర్ లాకింగ్ పనుల వలన విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు విశాఖ-కోరాపుట్ ప్యాసింజర్ (53587/88), విశాఖ-రాయపూర్(55827/28), విశాఖ-కోరాపుట్ వీక్లీ ఎక్స్ ప్రెస్(18511/12 ) రైళ్లు ఈనెల 22 నుంచి మే 5 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

error: Content is protected !!