News April 5, 2025
సీఎం చంద్రబాబు ముప్పాళ్లలో శంకుస్థాపన చేసిన పనుల వివరాలివే(2/2)

నేడు సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని గురుకులాలు, SC హాస్టళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ్) కింద కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లకై రూ.58.14 కోట్లతో చేపట్టనున్న 1,938 పనులకు, అలాగే 153 ప్రభుత్వ విద్యాసంస్థలలో రూ.5.18 కోట్లతో PM- AJAY పథకం కింద ఆర్వో ప్లాంట్ల ద్వారా తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రజాప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపన చేసి పైలాన్ను ఆవిష్కరించారు.
Similar News
News April 18, 2025
కడపలో ఇదే దొంగల కారు జాగ్రత్త..!

నెల్లూరు జిల్లాలో వైట్ షిఫ్ట్ కారులో కొంతమంది వ్యక్తులు ఊరి వెలుపల ఉండి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారు కడప జిల్లా వైపు రావడంతో కడప పోలీసులకు సమాచారమిచ్చారు. లింగాపురం వద్ద కాపు కాసిన పోలీసులను చూసి కల్లూరు మీదుగా పరారయ్యారు. వి.రాజుపాలెం వద్ద ఒకరు దొరకకగా ఇద్దరు జంపయ్యారు. ట్రైనీ DSP భవాని, చాపాడు, కమలాపురం పోలీసుల సమన్వయంతో వాహనం స్వాధీనం చేసుకున్నారు.
News April 18, 2025
ఉదయాన్నే నోటిని ఆయిల్తో పుక్కిలిస్తే..

ఉదయాన్నే నోటిని ఆయిల్తో పుక్కిలించడం వల్ల దంతాలు శుభ్రపడడంతో పాటు బలోపేతం అవుతాయని, నోటి దుర్వాసన పోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంని, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేస్తుందని పేర్కొంటున్నారు. ఆయిల్ పుల్లింగ్ కోసం కొబ్బరి/ నువ్వుల/ సన్ ఫ్లవర్ నూనెను ఉపయోగించవచ్చని.. 15-20min పుక్కిలించి, తర్వాత గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
News April 18, 2025
కర్నూలులో క్వింటా ఉల్లి రూ.879

ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. కర్నూలు మార్కెట్కు నిన్న 479 క్వింటాళ్ల సరకు రాగా గరిష్ఠ ధర క్వింటా రూ.879, కనిష్ఠ రూ.675, సగటు రూ.755 పలికింది. మహారాష్ట్ర నుంచి జిల్లాకు భారీగా దిగుమతి అవుతుండటంతో ధరలపై ఎఫెక్ట్ పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మిర్చి క్వింటా రూ.4వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతోంది.