News April 12, 2024

సీఎం జగన్ పోటీ చేసేది ఈమెనే

image

భారత చైతన్య యువజన పార్టీ తరఫున పులివెందులలో సీఎం జగన్‌పై సూరే నిర్మల పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పేరును ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఈ క్రమంలో జగన్ పై పోటీ చేస్తున్న మొదటి మహిళగా నిలవనున్నారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులలో నిర్మల పోటీ చేస్తుండటంతో బీసీల ఓట్లు తమకే వస్తాయని ధీమాగా ఉన్నారు. మరోవైపు టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు.

Similar News

News March 17, 2025

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

image

ఏప్రిల్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒంటిమిట్ట ఆలయం, 4 మాడవీధులు, కళ్యాణ వేదిక, పార్కింగ్ ఇతర ప్రాంతాలను పరిశీలించి తీసుకోవాల్సిన భద్రత చర్యలపై సమీక్షించారు.

News March 16, 2025

WPL ఫైనల్: రెండు వికెట్లు తీసిన కడప జిల్లా అమ్మాయి

image

ఉమెన్ ప్రీమియర్ లీగ్(WPL) ఫైనల్ శనివారం జరిగింది. ఈ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్, డిల్లీ క్యాపిటల్స్ తలపడగా ముంబై గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో మన కడప జిల్లా ఎర్రగుంట్లలోని ఆర్డీపీపీకి చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి డిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడింది. ముందుగా బౌలింగ్‌ చేసి 4 ఓవర్లకు 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. బ్యాటింగ్‌లో 4 బంతులకు 3 పరుగులు చేసింది.

News March 16, 2025

కడప: ‘డిగ్రీ కాలేజీల్లో ఒంటిపూట తరగతులు పెట్టాలి’

image

వైవీయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో ఒంటిపూట తరగతులకు అనుమతించాలని ప్రభుత్వ కళాశాలల అధ్యాపక సంఘం (జీసీటీఏ), ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం (జీసీజీటీఏ) నాయకులు కోరారు. శనివారం వైవీయూలో రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మను కలిసి వారు వినతి పత్రం అందజేశారు. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఒంటిపూట తరగతులు నిర్వహణకు అనుమతించాలన్నారు. నాయకులు శశికాంత్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, సుందరేశ్వర్ పాల్గొన్నారు.

error: Content is protected !!