News June 16, 2024

సీఎం టూర్.. పోలవరంలో ఎస్పీ తనిఖీలు

image

పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలలో భద్రతా పరమైన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, వీవీఐపీ భద్రత కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

Similar News

News December 10, 2025

రాయకుదురు: ‘టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక అమలు చేయాలి’

image

పదో తరగతి విద్యార్థులకు నిర్ణయించిన ప్రణాళికను అనుసరించి వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని ఉపవిద్యా శాఖ అధికారి ఎన్. రమేష్ అన్నారు. బుధవారం రాయకుదురు జడ్పీ హైస్కూల్‌ను ఆయన తనిఖీ చేశారు. హై స్కూల్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ హైస్కూళ్లకు చెందిన హెచ్ఎంలతో పాటు సబ్జెక్టులకు సంబంధించిన ప్యానల్ మెంబర్స్‌తో సమావేశం నిర్వహించారు. విద్యాభివృద్ధికి పలు సూచనలు ఇచ్చారు.

News December 10, 2025

పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి: కలెక్టర్

image

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం ఆమె కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఇన్వెస్టర్లతో ముఖాముఖి మాట్లాడారు. నూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాల మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

News December 9, 2025

రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తాం: కలెక్టర్

image

ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, దీనిలో భాగంగానే ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ విశ్వవిద్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RJY)తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. తద్వారా ఉద్యాన రంగంలో మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు.