News January 20, 2025
సీఎం, డిప్యూటీ సీఎంకు హరిరామ జోగయ్య లేఖ

మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు హరిరామ జోగయ్య సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కి లేఖ రాశారు. కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. వైసీపీ కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి రిజర్వేషన్ అమలు చేయలేదని మండిపడ్డారు. గతంలో తాను నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ రిజర్వేషన్ అంశంలో కలిసి పనిచేద్దామని చెప్పారన్నారు. పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News September 15, 2025
తూ.గో: నేడు కలెక్టరేట్లో PGRS

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని కూడా సూచించారు.
News September 14, 2025
రాజమండ్రి ఎంపీకి 7వ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో రాజమండ్రి ఎంపీ పురందీశ్వరికి 13వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 73 ప్రశ్నలు అడగటంతో పాటు 13 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 86.76గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
News September 14, 2025
రాజమండ్రి: లోక్ అదాలత్లో 4,733 కేసులు పరిష్కారం

రాజమండ్రిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 4,733 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా ఇన్ఛార్జ్ జడ్జి మాధురి ఈ వివరాలను వెల్లడించారు. ఈ కేసుల ద్వారా బాధితులకు రూ.16.35 కోట్లకు పైగా పరిహారం అందనుంది. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్లు ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.