News September 14, 2024

సీఎం నివాసం వద్ద విశాఖ జిల్లా మహిళ ఆవేదన

image

విశాఖ జిల్లాలోని భీమిలికి చెందిన వైసీపీ నేత నుంచి తనకు ప్రాణహాని ఉందని భీమిలికి చెందిన వెంకటలక్ష్మి శుక్రవారం మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. అతని వద్ద 2021నుంచి చిట్టీలు కడుతున్నానని, ఇటీవల చిట్టీ డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తమకు సీఎం చంద్రబాబు, లోకేశ్‌లే న్యాయం చేయాలని ఉండవల్లిలోని సీఎం ఇంటి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Similar News

News October 25, 2025

విశాఖలో సీఐల బదిలీ: సీపీ

image

విశాఖలో 8మంది CIలను బదిలీ చేస్తూ CP శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. 1టౌన్ సీఐ జీడి బాబును ఎయిర్ పోర్టు ప్రోటోకాల్‌కు, సీసీఎస్‌లో ఉన్న సీఐ శంకర్‌నారాయణను ఎయిర్ పోర్టు స్టేషన్‌కు, అక్కడ పనిచేస్తున్న ఉమామహేశ్వరరావును సిటీ వీఆర్‌కు, రేంజ్‌లో ఉన్న వరప్రసాద్‌ను వన్‌టౌన్ స్టేషన్‌కు, సీపోర్టు ఇమిగ్రేషన్‌లో ఉన్న శ్రీనివాసరావును వీఆర్‌కు, సిటీ వీఆర్‌లో ఉన్న రామకృష్ణ స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు.

News October 25, 2025

నాగుల చవితి సందర్భంగా VMRDA పార్కుల్లో ఉచిత ప్రవేశం

image

నాగుల చవితి పండగ సందర్భంగా నగరవాసుల సౌకర్యార్థం శనివారం VMRDA పరిధిలోని అన్ని పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ ప్రకటించారు. నాగుల చవితి పురస్కరించుకుని ప్రజలు పుట్టల్లో పాలు పోసేందుకు కుటుంబసభ్యులతో పెద్ద సంఖ్యలో వస్తారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బీచ్ రోడ్ పార్క్, సెంట్రల్ పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్క్‌లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.

News October 24, 2025

విశాఖ: రోజ్‌గార్ మేళాలో యువతకు నియామక పత్రాల అందజేత

image

ఉడా చిల్డ్రన్ ఏరియాలో శుక్రవారం రోజ్‌గార్ మేళా నిర్వహించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాస్ పాల్గొని నూతనంగా ఉద్యోగాలు సాధించిన 100 మంది యువతకు ప్రభుత్వ శాఖలలో నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో 51వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు ఈరోజు అందజేసినట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.