News March 24, 2025
సీఎం పర్యటన విజయవంతం చేయాలి: బాపట్ల కలెక్టర్

చినగంజాం మండలం చిన్న గొల్లపాలెం గ్రామానికి సీఎం చంద్రబాబు రానున్నారని కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. ఏప్రిల్ ఒకటో తేదీన సీఎం పర్యటన ఖరారు నేపథ్యంలో జిల్లా అధికారులతో సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన జయప్రదం చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, తదితరులు ఉన్నారు.
Similar News
News November 14, 2025
భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి దేవస్థానంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. కార్తీక శుక్రవారం కావడంతో భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు.
News November 14, 2025
KVS, NVSలో 14,967 పోస్టుల వివరాలు

<
News November 14, 2025
కాకినాడ- అనకాపల్లి మధ్య ఎయిర్ పోర్టు: CM

ఉమ్మడి తూ.గో జిల్లాలను ఎకనమిక్ రీజియన్లో చేర్చి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో గురువారం జరిగిన సదస్సులో 3 జిల్లాల కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. కాకినాడ- అనకాపల్లి మధ్య చిన్న ఎయిర్ పోర్టు నిర్మిస్తామని చెప్పారు. కడియం నర్సరీలు, పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేయాలన్నారు. తలసరి ఆదాయం కోనసీమ రూ.2.09 లక్షలు, కాకినాడ రూ.2.42L, తూ.గో రూ.2.59 లక్షలుగా ఉందన్నారు.


