News August 7, 2024

సీఎం పర్యటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

image

ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి వైరాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం 14వ వార్డు నందు డాంబర్ వెంచర్ స్థలాన్ని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, టిపిసిసి కార్యదర్శి కట్ల రంగారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొదుల హరినాథ్, కట్ల సంతోష్, పమ్మీ అశోక్, పల్లపు కొండలు, ఆత్మ కమిటీ ఛైర్మన్ కోసూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Similar News

News April 15, 2026

ఆర్టీసీ బస్సు ఢీకొని సీపీఐ నేత మృతి

image

తల్లాడ మండలంలోని నరసింహరావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఐ మండల కార్యదర్శి ఓర్సు రమేష్‌ దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేష్‌ మృతితో మండలంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఆయన మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌ సంతాపం వ్యక్తం చేశారు.

News April 15, 2026

ఆర్టీసీ బస్సు ఢీకొని సీపీఐ నేత మృతి

image

తల్లాడ మండలంలోని నరసింహరావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఐ మండల కార్యదర్శి ఓర్సు రమేష్‌ దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేష్‌ మృతితో మండలంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఆయన మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌ సంతాపం వ్యక్తం చేశారు.

News April 14, 2026

గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతం కావాలి: టీపీసీసీ చీఫ్

image

ఖమ్మం డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి, ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్‌కి ఎప్పుడూ అండగా నిలిచిందని అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.