News August 19, 2024

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మాజీ కార్పొరేటర్

image

సీఎం రేవంత్ రెడ్డికి రాంనగర్ మాజీ కార్పొరేటర్ ఆర్ కల్పనా యాదవ్ సోమవారం రాఖీ కట్టి తన సోదర భావాన్ని ఆయనతో పంచుకున్నారు. ఆడబిడ్డలకు అండగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలందరూ సీఎంకు అండగా నిలవాలని కోరారు.

Similar News

News November 7, 2025

HYD: KTR.. రాసిపెట్టుకో..!: కాంగ్రెస్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRS పార్టీ పతనానికి రెఫరెండమని, మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే శాశ్వతంగా దూరంకొట్టారని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ మీ సీటు గాయబే.. ఇక్కడి నుంచి మీ పార్టీ కనుమరుగు కావడం ఖాయం.. రాసిపెట్టుకో KTR’ అని పేర్కొంది. కాగా జూబ్లీహిల్స్‌లో BRS గెలవదని, కచ్చితంగా తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News November 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్స్: రూ.3.33 కోట్లు సీజ్

image

ఎన్నికలంటే మాటలా.. మొత్తం డబ్బుతోనే పని.. అందుకే నాయకులు వివిధ మార్గాల్లో డబ్బు తరలిస్తుంటారు. అలా వివరాలు లేక పట్టుబడిన డబ్బును పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.3.33 కోట్లను సీజ్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అయితే వివరాలు చెప్పిన వారికి డబ్బు తిరిగి ఇస్తున్నామని పేర్కొన్నారు.

News November 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: అధిష్టానం చూస్తోంది బాసూ..!

image

ఒక్క హైదరాబాదు వాసులే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తున్నారు. అంతేకాదు ఆయా పార్టీల అధిష్ఠానాలు కూడా ఈ ఎన్నికలపై ఆసక్తి చూపుతున్నాయి. ఎలాగైనా గెలిచి ఢిల్లీలో తమ సత్తా ఏంటో చూపించాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరాటపడుతున్నారు. కేటీఆర్ మాత్రం గెలిచి KCRకు ఈ విజయం బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక్కడ పట్టుకోసం, ఢిల్లీలో పరువు కోసం నాయకులు పాకులాడుతున్నారు.