News August 19, 2024
సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మాజీ కార్పొరేటర్

సీఎం రేవంత్ రెడ్డికి రాంనగర్ మాజీ కార్పొరేటర్ ఆర్ కల్పనా యాదవ్ సోమవారం రాఖీ కట్టి తన సోదర భావాన్ని ఆయనతో పంచుకున్నారు. ఆడబిడ్డలకు అండగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలందరూ సీఎంకు అండగా నిలవాలని కోరారు.
Similar News
News November 14, 2025
HYD: ఇక సిటీలోనూ కాంగ్రెస్ హవా..!

గతంలో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత క్రమంగా గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పల్లె ప్రజలే కాంగ్రెస్కు పట్టం కట్టారు. అయితే హస్తం పార్టీకి సిటీలో బలం లేదనే చర్చ ఏళ్లుగా కొనసాగింది. ఇటీవల కంటోన్మెంట్, తాజాగా జూబ్లీహిల్స్ బైపోల్ విజయంతో సిటీలో కాంగ్రెస్కు పునర్ వైభవం వచ్చిందని, GHMC ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ RECORD

జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా నిలిచారు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడగా అదే ఏడాది జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి TDPపై 21,741 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ దానిని బీట్ చేయలేకపోయారు. కానీ నవీన్ యాదవ్ ఈ ఉపఎన్నికలో 24,729 ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్లో BRS ఓటమికి కారణాలివే?

జూబ్లీహిల్స్లో BRS ఓటమికి కొన్ని కారణాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే..
1.KCR ప్రచారానికి రాకపోవడం(కార్యకర్తల్లో నిరాశ)
2.బస్తీలకి చేరని SM పోస్టులు(మాస్ జనం దూరం)
3.నవీన్ యాదవ్ సామర్థ్యాన్ని అంచనా వేయకపోవడం
4.పోల్ మేనేజ్మెంట్లో విఫలం
5.సింపతి కలిసిరాకపోవడం
6.మాగంటి ఫ్యామిలీలో కలహాలు(గోపీనాథ్ తల్లి, మొదటి భార్య కొడుకు స్టేట్మెంట్)


