News January 29, 2025

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్

image

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. రైతుల అప్పులు ముఖ్యమా..? దావోస్ డబ్బులు ముఖ్యమా..? అంటూ X వేదికగా ప్రశ్నించారు. ఎంవోయూలపై రేవంత్, భట్టి పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. మీ లెక్కలు డొల్ల ప్రచారమని తేలిపోయింది అన్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తానని ఇవ్వలేదు. గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న రైతులను మోసం చేశారని విమర్శించారు.

Similar News

News November 12, 2025

HYD: ఏడాదికి 20 వేలకు పైగా క్యాన్సర్ కేసులు..!

image

HYDలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రికి ప్రతి సంవత్సరం సుమారు 20,000 మంది కొత్త క్యాన్సర్ బాధితులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఈ ప్రభుత్వ వైద్య కేంద్రానికి వస్తున్నారు. ఆసుపత్రిలో ఉచితంగా కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక విభాగాలు, పాలియేటివ్ కేర్ యూనిట్లు కూడా ఉన్నాయి.

News November 12, 2025

HYD: ఏడాదికి 20 వేలకు పైగా క్యాన్సర్ కేసులు..!

image

HYDలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రికి ప్రతి సంవత్సరం సుమారు 20,000 మంది కొత్త క్యాన్సర్ బాధితులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఈ ప్రభుత్వ వైద్య కేంద్రానికి వస్తున్నారు. ఆసుపత్రిలో ఉచితంగా కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక విభాగాలు, పాలియేటివ్ కేర్ యూనిట్లు కూడా ఉన్నాయి.

News November 12, 2025

సిద్దిపేట: యువ వ్యాపారవేత్త సూసైడ్

image

అప్పుల భారాన్ని తట్టుకోలేక యువ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని మోతేలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రాజు (35) జీవనోపాధి కోసం దుబ్బాకలో బ్యాంగిల్ స్టోర్ నడుపుతున్నాడు. భార్య, ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. మంగళవారం మోతే గ్రామంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.