News January 29, 2025
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. రైతుల అప్పులు ముఖ్యమా..? దావోస్ డబ్బులు ముఖ్యమా..? అంటూ X వేదికగా ప్రశ్నించారు. ఎంవోయూలపై రేవంత్, భట్టి పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. మీ లెక్కలు డొల్ల ప్రచారమని తేలిపోయింది అన్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తానని ఇవ్వలేదు. గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న రైతులను మోసం చేశారని విమర్శించారు.
Similar News
News November 16, 2025
IPL 2026 వేలానికి స్టార్ ప్లేయర్లు

వచ్చే IPL సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్డ్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. దీంతో స్టార్ క్రికెటర్లు వేలానికి వచ్చారు. ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్వెల్ , లివింగ్స్టోన్ వంటి ప్లేయర్లు బిడ్డింగ్లో టార్గెట్ కానున్నారు. అదే విధంగా పతిరణతో పాటు జోష్ ఇంగ్లిస్, బిష్ణోయి, జంపా, డేవిడ్ మిల్లర్, వెంకటేశ్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు కూడా మినీ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
News November 16, 2025
సంజయ్ ఎమ్మెల్యే పదవి ఉంటుందా? ఊడుతుందా?

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల MLA సంజయ్ పై అసెంబ్లీలో విచారణ పూర్తైంది. స్పీకర్ తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. MLAపై వేటు పడుతుందా లేదా అనేదానిపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తే పశ్చిమ బెంగాల్ MLA ముకుల్ రాయ్ సభ్యత్వాన్ని అక్కడి హైకోర్టు రద్దు చేసినట్లు ఇక్కడ కూడా ఆ పరిస్థితి లేకపోలేదని పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
News November 16, 2025
భర్త హత్యాయత్నం ఘటనలో భార్య మృతి

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో అనుమానంతో ఎర్రిస్వామి తన భార్య రత్నమ్మను కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకుంది. రత్నమ్మను కుటుంబసభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.


