News July 5, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మల్ కాంగ్రెస్ నాయకులు

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిర్మల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విట్టల్ బీఆర్ఎస్‌కి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆయనతో కలిసి సీఎంను కలిసి శాలువాతో సత్కరించారు. ఇందులో పార్లమెంట్ జిల్లా ఇన్‌ఛార్జ్ సత్తు మల్లేశ్, మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ మాన్ అలీ, తదితరులున్నారు.

Similar News

News October 6, 2024

దిలావర్పూర్: కొత్త చెరువులో గుర్తుతెలియని శవం

image

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలోని కొత్తచెరువులో ఆదివారం గుర్తుతెలియని శవం లభ్యమయింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. అటువైపు వెళ్లిన కొందరు నీటిపై తేలుతున్న శవాన్ని చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 6, 2024

గాంధీ ఆస్పత్రి నుంచి జైనూరు ఆదివాసి మహిళ డిశ్ఛార్జ్

image

ఆటో రిక్షా డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడిన కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ జైనూరుకు చెందిన ఆదివాసి మహిళ ట్రీట్మెంట్ గాంధీలో పూర్తి కావడంతో కాసేపటి క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గాంధీ ఆసుపత్రికి వచ్చి ఆమెను పరామర్శించారు. అలాగే కొంత నగదు, దుస్తులను అందజేశారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

News October 5, 2024

లోకేశ్వరం: విష జ్వరంతో మహిళ మృతి

image

విష జ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన శనివారం లోకేశ్వరం మండల కేంద్రంలో
చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని లోకేశ్వరం గ్రామానికి చెందిన సిరిపెల్లి గంగామణి 34 జ్వరంతో బాధపడుతూ
లోకేశ్వరంలో డాక్టర్‌ను సంప్రదించిన నయం కాకపోవడంతో నిర్మల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందినట్లు తెలిపారు.