News June 20, 2024
సీఎం రేవంత్ వద్దకు కుంట్లూరు గుడిసెల వ్యవహారం

హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ మం. కుంట్లూరు రెవెన్యూ పరిధి భూదాన్ భూమిలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు న్యాయం చేయాలని సీపీఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. CPI రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబశివరావు, నాయకులు జంగయ్య, రవీంద్ర చారి, ముత్యాల యాదిరెడ్డి, పర్వతాలు CMని కలిసి వినతి పత్రం అందించారు. ఈ వ్యవహారంపై ఆయన సానుకూలంగా స్పందించారని కూనంనేని వెల్లడించారు.
Similar News
News November 12, 2025
HYD: గాంధీ విగ్రహాల సేకరణ ప్రచార రథం ప్రారంభం

గాంధీభవన్లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాపన స్వర్ణోత్సవాల సందర్భంగా చేపట్టిన ‘ఒక అడుగు- లక్ష గాంధీజీ విగ్రహాలు’ కార్యక్రమానికి ప్రచార రథాన్ని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహం ప్రతిష్ఠాపనకు పూనుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
News November 12, 2025
HYD: డ్రగ్ కేసులో నైజీరియన్ డిపోర్టేషన్

హైదరాబాద్ H-NEW పోలీసులు డ్రగ్ కేసులో నైజీరియన్ ఒన్యేవుకూ కెలెచి విక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా భారత్లో ఉండి డ్రగ్ సరఫరాలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. FRRO సహకారంతో అతడిని డిపార్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నైజీరియన్స్ అనుమానాస్పదంగా కనబడితే తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
News November 12, 2025
FLASH: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈరోజు అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడు సలీంను (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడి బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సలీంను అదుపులోకి తీసుకున్న అధికారులు, నిషేధిత వస్తువులను సీజ్ చేశారు.


