News March 25, 2025
సీఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

హుజూర్ నగర్లో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక అధికారులు సభా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు పార్కింగ్ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు ఉన్నారు.
Similar News
News December 4, 2025
MHBD జిల్లాలో 9 గ్రామాలు ఏకగ్రీవం

MHBD జిల్లాలో 9మంది సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లికుదురు(M) పార్వతమ్మగూడెం నుంచి పూలమ్మ, కేసముద్రం(M) చంద్రుతండా నుంచి శ్రీను, క్యాంపుతండా నుంచి కైక, నారాయణపురం నుంచి యమున ఏకగ్రీవమయ్యారు. ఇనుగుర్తి(M) పాతతండా నుంచి నరేష్, రాముతండా నుంచి మీటునాయక్, MHBD(M) సికింద్రాబాద్ తండా నుంచి నూనావత్ ఇస్తారి, రెడ్యాల నుంచి లక్ష్మి, గూడూరు(M) రాజన్పల్లి నుంచి మంగ సర్పంచ్లుగా ఎన్నికయ్యారు.
News December 4, 2025
దేశ సేవలో అన్నదమ్ములు..

నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు అగ్నివీరులుగా ఎంపికయ్యారు. మహబూబ్ బాషా కుమారులు అబ్దుల్ నబీ, మహమ్మద్ ఇర్ఫాన్ అగ్నివీర్ నియామకాల్లో ప్రతిభ చూపారు. బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మహమ్మద్ ఇర్ఫాన్ రాజస్థాన్లో, అబ్దుల్ నబీ హిమాచల్ప్రదేశ్లో విధుల్లో చేరి బాధ్యతలు స్వీకరించారు. దేశ సేవకు అంకితమైన వారిని స్థానికులు అభినందించారు.
News December 4, 2025
పవన్ కళ్యాణ్కు మంత్రి ఆనం సూచన ఇదే..!

ఆత్మకూరు అభివృద్ధికి తాను ఏమి అడిగినా అన్ని ఇచ్చారని Dy.CM పవన్ కళ్యాణ్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. ఆత్మకూరులో కొత్త DDO ఆఫీస్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘ఒకేసారి 77ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పాత భవనాల్లో DDO ఆఫీసులు పెట్టారు. ఒకే మోడల్తో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బిల్డింగ్లు కట్టించండి’ అని ఆనం కోరగా ఆలోచన చేస్తామని పవన్ చెప్పారు.


