News February 14, 2025
సీఎం సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి

మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరారు. గురువారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి ఆళ్ల నానిని సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సీనియర్ నేత సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు.
Similar News
News November 27, 2025
అమరావతి ఎల్పీఎస్ లేఅవుట్లకు ప్రత్యేక పర్యవేక్షణ

అమరావతి ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఏపీసీఆర్డీఏ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. రైతుల సమస్యలు, లేఅవుట్ల అడ్డంకులను పరిష్కరించేందుకు 17 మంది అధికారులను డిప్యూటేషన్పై నియమించనుంది. వారిలో ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు, అయిదుగురు తహశీల్దారులు, అయిదుగురు డిప్యూటీ తహశీల్దారులు ఉన్నారు. వీరు భూయజమానులతో నేరుగా చర్చించి ఎల్పీఎస్లో భాగస్వామ్యం కల్పిస్తారు.
News November 26, 2025
GNT: ఎండీఎంఏ రవాణాపై పోలీసుల కట్టుదిట్టమైన నిఘా

గుంటూరులో మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా మరింత కఠినమైంది. ఒక వారం వ్యవధిలో ఎండీఎంఏ కొనుగోలు,అమ్మకాలకు సంబంధించిన ఎనిమిది మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎలక్ట్రానిక్ పరికరాల్లో డ్రగ్స్ దాచి యువతకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వృత్తి విద్య చదువుతున్న వారినే లక్ష్యంగా చేసుకుని అలవాటు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. బెంగళూరు–గుంటూరు మార్గంలో రవాణాపై నిఘా కొనసాగుతోంది.
News November 24, 2025
ఆధార్ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జనన ధృవీకరణపత్రాలు లేని వారిని గుర్తించి వారికి ఆధార్ కార్డులు జారీ చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్ వీసీ హాలులో రెవెన్యూ రీ సర్వే , గృహనిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయ సేవలు, ఉపాధి హామీ పథకం అంశాల కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రీసర్వేలో మ్యూటేషన్లు దరఖాస్తులపై రెవెన్యూ డివిజన్ అధికారులు పత్యేక శ్రద్ధ తీసుకొని పరిశీలించాలన్నారు.


