News September 9, 2024
సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం: దామచర్ల

వరద బాధితుల సహాయార్థం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావు కోటి రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో శిద్దా రాఘవరావు, ఆయన సోదరులు, గోరంట్ల రవికుమార్, సుధానగుంట నరసింహారావు, వెంకట రామయ్య మరియు నిడమానూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 9, 2025
ఇళ్ల స్థలాల దరఖాస్తుల్లో పెండింగ్ ఉండరాదు: JC

ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను పెండింగ్లో లేకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో సోమవారం జేసీ మాట్లాడుతూ.. ఇంటి పట్టాల రీ- వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అలాగే ఇంటి పట్టాల రీ-వెరిఫికేషన్పై MROలు ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
News December 9, 2025
ప్రకాశం: ‘డిసెంబర్ 31 వరకు అవకాశం’

ఇంట్లో గృహోపకరణాలపై అడిషనల్ లోడ్పై చెల్లింపులో 50% రాయితీ ఇస్తున్నట్లు SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. 1కిలో వాట్కు రూ.2250 అవుతుందని రాయితీ వలన రూ.1250 చెల్లించవచ్చని అన్నారు. ఈ అవకాశం ఈనెల 31 వరకు మాత్రమేనని తెలిపారు. ఇంట్లో గృహోపకరణాలను బట్టి లోడ్ కట్టుకోవాలన్నారు. తనిఖీల్లో లోడ్ తక్కువగా ఉంటే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
News December 9, 2025
ప్రకాశం SP మీ కోసంకు 119 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 119 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే వృద్ధులతో, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు.


