News June 29, 2024

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: DMHO

image

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర చెప్పారు. ఈ గన్నవరం మండలం బెల్లంపూడి ఎస్సీ పేటలో శుక్రవారం సర్పంచ్ బండి మహాలక్ష్మితో కలిసి పర్యటించారు. సీజనల్ జ్వరాల బాధితుల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, బయట ఆహార పదార్థాలను తీసుకోవద్దని సూచించారు.

Similar News

News October 28, 2025

అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి: తూ.గో కలెక్టర్

image

అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై సోమవారం క్షేత్రస్థాయి అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలో 9 మండలాలు, 303 గ్రామాలు తుఫాన్‌తో ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. 12 మండల కంట్రోల్ రూములు, 184 పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

News October 27, 2025

రాజమండ్రి: ఇంటర్ విద్యార్థులకు గమనిక

image

ఇంటర్ విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా ఫీజు చెల్లించాలసి ఉంటుందని ఆర్ఐవో NSVL నరసింహం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్, రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులంతా తమ పరీక్ష ఫీజును ఈ గడువులో చెల్లించాలని చెప్పారు. గడువు దాటితే రూ.1000 ఫైన్‌తో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

News October 27, 2025

ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత: కలెక్టర్

image

జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని APSDMA రెడ్ అలర్ట్ ఇచ్చినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం సూచించారు. 50-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలవవద్దని హెచ్చరించారు. సోమవారం, మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.