News March 4, 2025

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: DMHO

image

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాపట్ల DMHO డాక్టర్ విజయమ్మ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం అద్దంకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను DMHO సందర్శించారు. వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించి, సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు ఇచ్చారు. 

Similar News

News November 15, 2025

రేడియో కాలర్ టెక్నాలజీతో ఏనుగుల దాడులకు చెక్.?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల <<18272761 >>దాడుల<<>> అడ్డుకట్టకు అధికారులు రేడియో కాలర్ టెక్నాలజీని వాడనున్నారు. అందులో అమర్చే GPS టెక్నాలజీ ద్వారా ఏనుగుల కదలికలను రియల్ టైమ్‌లో గుర్తించే వీలు ఉంటుంది. గుంపులోని ఒక ఏనుగకు ఈ రేడియె కాలర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా అవి గ్రామాల వైపు మళ్లినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. దీని ద్వారా మనుషుల, ఏనుగుల మధ్య సంఘర్షణ తగ్గించే అవకాశం ఉందని ఇటీవల Dy.CM పవన్ సూచించారు.

News November 15, 2025

సూర్యాపేటలో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

image

దురాజ్‌పల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన కారణంగా రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివ్వెంల పోలీసులు, రహదారి సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేసే పనిలో ఉన్నారు.

News November 15, 2025

జీఎస్టీ సంస్కరణలతో బీమా రంగం వృద్ధి: IRDAI

image

GST సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత బీమా రంగంలో వృద్ధి కనిపిస్తోందని IRDAI మెంబర్ దీపక్ సూద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీమాను నిత్యవసర వస్తువుగా చూస్తోందన్నారు. బీమా పాలసీలపై జీఎస్టీని జీరో శాతానికి తీసుకురావడం ఇన్సూరెన్స్ రంగానికి కలిసొచ్చిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వస్తున్న నష్టాల నుంచి బయటపడేందుకు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని, జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించాలని సూచించారు.