News March 1, 2025

సీతంపేటలో పర్యటించిన కలెక్టర్

image

సీతంపేటలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా జరుగుతున్న జీడీ ప్రాసెసింగ్, అగరబత్తుల తయారీ విధానాన్ని పరిశీలించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పట్టు పరిశ్రమ యూనిట్‌ను సందర్శించారు. సీతంపేట ఐటీడీఎ ప్రాజెక్టు అధికారి సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, అధికారులు తదితరులు ఉన్నారు.

Similar News

News March 3, 2025

బీటెక్ విద్యార్థి మృతి సూసైడ్

image

నల్లమడ మండలం వెళ్లమద్ది గ్రామానికి చెందిన ప్రేమసాయి(21) పురుగు మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రేమసాయి చిత్తూరులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. చుట్టుపక్కల వారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం సమయంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.

News March 3, 2025

ఆసీస్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై గెలిచి సెమీస్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్ధమైంది. కాగా వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్ పరాభవానికి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. ఈ నెల 4న దుబాయ్ వేదికగా సెమీస్ జరగనుంది. ఆ మ్యాచులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ బాధ వారికి కూడా రుచి చూపించాలని కామెంట్లు చేస్తున్నారు.

News March 3, 2025

వరంగల్: అతిపెద్ద రన్‌‌ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

image

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్‌ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

error: Content is protected !!