News April 6, 2025

సీతంపేట: ఆటో బోల్తా.. ఒకరి మృతి

image

సీతంపేట పరిధిలో ఇసుకగెడ్డ వద్ద శనివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వెలగవాడకి చెందిన గొట్టపు లక్ష్మణరావు (36) పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సకాలంలో వైద్య సిబ్బంది స్పందించకపోవడం వలనే చనిపోయాడని మృతుడి బంధువులు ఆందోళన చేశారు. సీతంపేట ఎస్‌ఐ అన్నంరావు కేసు నమోదు చేశారు.

Similar News

News April 18, 2025

గద్వాల: ‘’జై భీమ్’ అని 1,46,385 సార్లు రాస్తే రూ.5016 బహుమతి?’

image

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వినూత్న కార్యక్రమం చేపట్టారు. భారత రాజ్యాంగంలో 1,46,385 పదాలు ఉన్నాయని, అందుకు అనుగుణంగా 1,46,385 సార్లు జై భీమ్.. జై భీమ్.. అని రాస్తే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఎవరైతే మంచి చేతి రాతతోని రాస్తారో వారికి రూ.5,016 బహుమతిగా ఇస్తానని కాంగ్రెస్ పార్టీ రాజోలి మండలాధ్యక్షుడు పులిపాటి దస్తగిరి ఒక ప్రకటనలో అన్నారు.

News April 18, 2025

ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

image

1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్(ఫొటోలో) మరణం
* ప్రపంచ వారసత్వ దినోత్సవం (అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం)

News April 18, 2025

భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చేందుకే భూభారతి: ఎమ్మెల్యే కడియం

image

తెలంగాణను భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే భూ భారతి- 2025 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. చిల్పూర్ మండల కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్స్‌లో భూ భారతి ఆర్ఆర్- 2025 చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌ పాల్గొన్నారు.

error: Content is protected !!