News March 28, 2025
సీతంపేట : మంచంపై నుంచి పడి విద్యార్థి మృతి

సీతంపేట మండలం దోనుబై ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న చలపతి శుక్రవారం మృతి చెందాడు. హాస్టల్లో తన బెడ్ నుంచి కిందికి దిగేప్పుడు కాలు జారిపడ్డాడు. ప్రమాదంలో చెవి భాగం వైపు గట్టిగా తగలటం వలన రక్తం రావటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తన తోటి స్నేహితులు చెప్తున్నారు. దోనుబై S.I ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిది కారెంకాగుమానుగడుగా సమాచారం.
Similar News
News November 27, 2025
వరంగల్: పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు

సెప్టెంబర్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్తోపాటు ఇటీవల నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమంలో అత్యధిక కేసులను రాజీమార్గంలో ముగించినందుకు కృషి చేసిన పోలీస్ అధికారులను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు అభినందించారు. ఈ మేరకు ఆయన చేతుల మీదుగా వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ప్రశంసాపత్రాలను అందజేశారు.
News November 27, 2025
టీమ్ ఇండియా సెలక్షన్పై CV ఆనంద్ అసంతృప్తి

భారత క్రికెట్ పరిస్థితిపై TG హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో భారత్లో ప్రత్యర్థులు గెలవడం అరుదుగా జరిగేదని.. ప్రస్తుతం భారత ప్లేయర్లు స్వదేశంలోనే స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోలేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రంజీలు ఆడకపోవడం, IPL ఆధారంగా సెలక్షన్ జరగడం దీనికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. రంజీలో రాణిస్తున్న ఆటగాళ్లను పక్కనబెట్టడం సెలక్షన్లో పక్షపాతానికి నిదర్శనమన్నారు.
News November 27, 2025
మంచిర్యాల: రైతుల ఖాతాలలో నగదు జమ

జిల్లాలో 2025-26సీజన్కు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలలో నగదు జమ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించి వరి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ఇటిక్యాలలో మెప్మా, గుల్లకోట కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతుల ఖాతాలలో నగదు జమ అయిందన్నారు.


