News March 10, 2025

సీతంపేట: రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

సీతంపేట ఐటీడీఏలో యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నట్లు సీతంపేట ఐటీడీఏ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలు సమర్పించుకోవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పీవో కోరారు.

Similar News

News December 6, 2025

ADB: వలస ఓటర్ల కోసం ‘ఖర్చుల’ ఆఫర్

image

ఉమ్మడి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈనెల 11న పోలింగ్ ఉన్న నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు గ్రామం బయట జీవనోపాధి కోసం ఉంటున్న వలస ఓటర్లపై దృష్టి సారించారు. అభ్యర్థులు వారికి ‘హలో అన్న.. హలో తమ్ముడూ..’ అంటూ ఫోన్లు చేసి పలకరిస్తున్నారు. ఓటు వేయడానికి గ్రామాలకు వచ్చేందుకు అవసరమైన రవాణా, ఇతర ఖర్చులు చెల్లిస్తామని హామీ ఇచ్చి, తప్పక వచ్చి ఓటు వేయాలని వేడుకుంటున్నారు.

News December 6, 2025

మంచిర్యాల: రిజర్వేషన్ అనుకూలిస్తే దోస్తీ.. లేకుంటే కుస్తీ

image

జిల్లాలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు అనుకూలిస్తే దోస్తీ, లేకపోతే కుస్తీ అన్నట్టుగా పరిస్థితులు మారాయని ప్రజలు అంటున్నారు. SC రిజర్వేషన్లు వచ్చిన గ్రామాల్లో అగ్రకులాల నాయకులు తమకు అనుకూలమైన అభ్యర్థులను నిలబెట్టి, తెరవెనుక తామే పాలన కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని సర్పంచ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పంచాయతీల నియంత్రణ మళ్లీ వారి చేతుల్లోకి వెళ్తే, రాజకీయ పెత్తనం వారి వశమే అవుతుందని వాపోతున్నారు.

News December 6, 2025

సరిహద్దులపై ‘డ్రాగన్’ పడగ.. 16 స్థావరాల నిర్మాణం!

image

భారత సరిహద్దుల్లో చైనా కుతంత్రాలు ఆగడం లేదు. టిబెట్‌లో సైనిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తోందని, 16 ఎయిర్‌ఫీల్డ్‌లు, హెలిపోర్ట్‌లను నిర్మించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈ మేరకు 100కు పైగా శాటిలైట్ ఇమేజె‌స్‌ను విశ్లేషించింది. ఆ స్థావరాలు చాలావరకు 14 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయని చెప్పింది. 14,850 అడుగుల పొడవైన రన్ వేలు, 70 కన్నా ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్లు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొంది.