News March 10, 2025

సీతంపేట: రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

సీతంపేట ఐటీడీఏలో యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నట్లు సీతంపేట ఐటీడీఏ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలు సమర్పించుకోవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పీవో కోరారు.

Similar News

News March 15, 2025

అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 195మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల్లో శనివారం ద్వితీయ ఇంటర్ జనరల్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ పరీక్షలకు మొత్తం 4,170మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4050మంది రాసారని, 116ఆబ్సెంట్ అయ్యారని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. 8కేంద్రాల్లో ఒకేషనల్ పరీక్షలకు 884మందికి గాను 805మంది హాజరు అయ్యారని, 79మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.

News March 15, 2025

చిన్న సినిమా.. తొలిరోజే భారీ కలెక్షన్లు

image

చిన్న సినిమాగా విడుదలైన ‘కోర్ట్’ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ప్రీమియర్స్, తొలి రోజు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇందులో షేర్ దాదాపు రూ.4.5 కోట్ల వరకు ఉంటుంది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.7 కోట్లు కాగా ఫస్ట్ డేనే సగానికి పైగా రికవరీ చేయడం విశేషం. మరి మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.

News March 15, 2025

నిజాంసాగర్: గ్రామస్థుల సహకారం అవసరం: కలెక్టర్

image

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన తల్లిదండ్రులకు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్ విద్యార్థులకు సులభంగా మౌలిక భాషా గణిత సామర్ధ్యాలను సాధించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 

error: Content is protected !!