News December 30, 2024

సీతంపేట: వాటర్ ట్యాంక్‌లో పడి బాలుడి మృతి

image

సీతంపేట మండలం జొనగ గ్రామానికి చెందిన ఎస్.రాజయ్య చిన్న కుమారుడు ఎస్.పవన్ కుమార్ (5) బాలుడు ఆడుకుంటూ వాటర్ ట్యాంక్‌లో పడి మరణించాడు. ఈ ఘటన  సోమవారం ఉదయం చోటుచేసుకుంది. నీటి ట్యాంక్‌లో పడిన బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Similar News

News October 22, 2025

పొందూరు: ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’

image

తన దైనందిక జీవితంలో రోజు వారి పనులకు తల్లిదండ్రులపైనే ఈ దివ్యాంగుడు ఆధారపడాల్సిన పరిస్థితి. పొందూరు(M) తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామానికి చెందిన మేకా నవీన్ కుమార్‌ 100 శాతం దివ్యాంగుడు. సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పింఛన్ రావడం లేదు. అధికారులు స్పందించి పెన్షన్ మంజూరయ్యేలా చూడాలని కుటుంబీకులు కోరుతున్నారు.

News October 22, 2025

శ్రీకాకుళం: ‘ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి’

image

ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు . జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో మంగళవారం క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రసాయన ఎరువులు, పురుగుల మందు రహిత వ్యవసాయం లక్ష్యంగా రైతులు ముందుకు సాగాలని అన్నారు. సహజ ఎరువులు, కషాయాలు వినియోగించాలని కోరారు.

News October 21, 2025

డీజే ఓ నిశ్శబ్ద హంతకి

image

పట్టణం, పల్లెలో డీజే శబ్దాలు హోరెత్తిస్తున్నాయి. శబ్ద తీవ్రత 50 డేసిబెల్స్ దాటితే మానవులకు గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నియమాలను నిర్వాహకులు పెడచెవిన పెట్టి పెద్ద శబ్దాలకు 100 డేసిబెల్స్‌ పెంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నెల16న నరసన్నపేటలోని <<18018296>>భవానిపురంలో<<>> గౌరమ్మ ఊరేగింపులో డీజే శబ్దానికి భవనం కూలి పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.