News December 30, 2024
సీతంపేట: వాటర్ ట్యాంక్లో పడి బాలుడి మృతి
సీతంపేట మండలం జొనగ గ్రామానికి చెందిన ఎస్.రాజయ్య చిన్న కుమారుడు ఎస్.పవన్ కుమార్ (5) బాలుడు ఆడుకుంటూ వాటర్ ట్యాంక్లో పడి మరణించాడు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. నీటి ట్యాంక్లో పడిన బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News January 15, 2025
మెళియాపుట్టిలో వారికి కనుమ రోజే భోగి
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని కోసమాలలో వింత ఆచారం పాటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని దేవాంగుల వీధిలో కనుమరోజు భోగి జరుపుకోవడం వీరి ప్రత్యేకత. తర తరాలనుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారమని తెలిపారు. ఈ వీధిలో నేత కార్మికులు ఎక్కువగా ఉండటంతో పండగ రోజు కూడా నేత వస్త్రాలు నేయడంలో బిజీగా ఉంటారు. కాబట్టి భోగి రోజు సాధ్యంకాక కనుమ రోజు భోగి జరుపుకోవడం ఆచారంగా వస్తుందన్నారు.
News January 15, 2025
సోంపేటలో పోలీస్ జాగిలాల విస్తృత తనిఖీలు
సోంపేట బస్ స్టేషన్, హోటళ్లు, కిరాణా షాపులలో బుధవారం సోంపేట సీఐ మంగరాజు ఆధ్వర్యంలో పోలీసు జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. మాదకద్రవ్యాల రవాణా, నిషేధిత వస్తువుల కోసం ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ తనిఖీలలో పలువురు పోలీసు సిబ్బంది ఉన్నారు.
News January 15, 2025
శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన సినీ నటుడు
శ్రీకాకుళం మండలంలో అరసవల్లి గ్రామంలో ఉండే శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి సినీ నటుడు సాయి కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. స్వామిని దర్శించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ యర్రంశెట్టి భద్రాజీ, శ్రీస్వామి వారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.