News August 15, 2024

సీతంపేట: సచివాలయ సెక్రటరీ అప్పలస్వామి మృతి

image

సీతంపేట మండలం కిల్లాడ గ్రామ సచివాలయ సెక్రటరీ అల్లాడ అప్పలస్వామి అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన స్వగ్రామం వీరఘట్టం మండలం ఎం.రాజపురం. సచివాలయ సెక్రటరీగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన వ్యక్తి ఇలా అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 2, 2025

SKLM: ‘లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి’

image

గార(M) వమరవెల్లి డైట్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న 3 సీనియర్ లెక్చరర్ పోస్టులు, 8 లెక్చరర్ పోస్టులు (డిప్యూటేషన్‌పై) నవంబర్ 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ జడ్పీ, మున్సిపల్ హైస్కూల్స్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్స్ లీప్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News November 1, 2025

ఇది శవ రాజకీయం తప్ప మరేమీ కాదు: TDP

image

కాశీబుగ్గలోని తమ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సాధారణంగా 2 వేల మంది వస్తుంటారని.. ఇంతమంది వస్తారని ఊహించలేదని నిర్వాహకుడు హరిముకుంద్ పండా అన్నారు. రద్దీ ఇంత ఉంటుందని తెలియక పోలీసులకు చెప్పలేదని పేర్కొన్నారు. దీనిపై టీడీపీ స్పందించింది. ‘ఇంత మంది ఎప్పుడూ రాలేదని’ ఆలయ ధర్మకర్తలే అంటుంటే ముందస్తు సమాచారం ఉంది అంటూ శవ రాజకీయం చేసే పార్టీ ఏపీలో ఉండటం దురదృష్టకరమని TDP మండిపడింది.

News November 1, 2025

కాశీబుగ్గకు బయల్దేరిన లోకేష్, రామ్మోహన్ నాయుడు

image

కాశీబుగ్గలో వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భోపాల్ పర్యటన రద్దు చేసుకున్న ఆయన.. కాశీబుగ్గకు బయలుదేరారు. అటు మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుంచి కాశీబుగ్గకు బయలుదేరారు. మొదట విశాఖ వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గకు చేరుకొని బాధితులను పరామర్శించనున్నారు.