News April 7, 2025

సీతానగరం: ప్రియురాలు ఒప్పుకోకపోవడంతో మృతి

image

మనసుకు నచ్చిన మహిళ తనతో ఉండదని అనే విషయాన్ని జీర్ణించకోలేని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలోని వేమగిరి సునీల్ (26) స్థానిక ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరుసకు మరదలు అయిన సదరు సదరు మహిళను కలిసి ఉందామని అడగాగ ఆంగీకరించకపోవడంతో మనస్థాపం చెంది మృతి చెందాడని ఎస్సై రామకుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News April 17, 2025

రిమాండ్ పొడిగింపు.. రాజమండ్రి జైలుకి అనిల్

image

వైసీపీకి చెందిన బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడిగిస్తూ నరసారావుపేటలోని రెండో అదనపు న్యాయాధికారి గాయ్రతి ఉత్తర్వులు ఇవ్వడంతో అతడిని మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. సీఎం, Dy.CM, లోకేశ్‌‌లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈనెల 28 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

News April 17, 2025

రాజమండ్రి: గోదావరిలో పడి మహిళ మృతి

image

రాజమండ్రిలోని మార్కండేశ్వర స్వామి గుడి సమీపంలో గోదావరిలో మునిగి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విజయనగరానికి చెందిన నారాయణమ్మ రాజమండ్రిలోని ఓంశాంతి ఆశ్రమానికి వచ్చి వెళుతుంటుంది. ఈ విధంగా అక్కడికి వచ్చి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి చనిపోయి ఉంటుందన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

News April 16, 2025

వైజాగ్‌లో ముక్కామలకు చెందిన యువకుడి మృతి

image

వైజాగ్‌లోని దివీస్‌లో పనిచేస్తున్న పెరవలి మండలం ముక్కామలకు చెందిన మధు మోహన్ మంగళవారం మృతి చెందాడు. మోహన్ దివీస్‌లో పనిచేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కి వచ్చాడు. అనంతరం ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భీమిలి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

error: Content is protected !!