News August 6, 2024
సీతారాంపురం: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి

సీతారాంపురంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గారపాటి చెన్నకేశవులు (42) మృతి చెందారు. సీతారాంపురంలోని కోట వీధిలో నివాసం ఉంటున్న చెన్నకేశవులు ఓ ఇంటి వద్ద కరెంటు పనిచేసేందుకు వెళ్లాడు. అంకాలమ్మ గుడి దగ్గర ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం లైన్ మార్చే క్రమంలో షాక్కు గురై అక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు.
Similar News
News February 23, 2026
నెల్లూరు: పరిశ్రమకు భూమి కేటాయింపు

ఉదయగిరి మండలం చెర్లోపల్లి–వడ్డీపాలెం గ్రామాల సమీపంలో బయోగ్యాస్(CBG) ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే నం.251లో సుమారు 200 ఎకరాల భూమిని ప్లాంట్ కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు. జనావాసాల దగ్గర ప్లాంట్ ఏర్పాటుతో దుర్వాసన, కాలుష్యం, ప్రమాదాల భయం పెరుగుతుందని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News February 23, 2026
NLR: ఇంటర్ పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు సిటీ DKW కళాశాలలో ఇంటర్ పరీక్షలను కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు సూచించారు.
News February 23, 2026
నెల్లూరులో ట్రాఫిక్ ASI సస్పెండ్

నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ASI వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బైకులపై కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఆపి ఫోన్ పే ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసుకున్న <<19199048>>వీడియో <<>>వైరల్గా మారింది. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో డబ్బులు లేవని వాహనదారులు చెబితే.. ఫోన్ పే చేయమని ఆయన ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వేటు పడింది.


