News March 7, 2025
సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు ముమ్మరం: కలెక్టర్

భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణం, మహా పట్టాభిషేకం మహోత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, ఏరు ఫెస్టివల్ విజయవంతం చేయాలని సూచించారు. ఆన్లైన్లో 75%, 25% మాన్యువల్గా టికెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.
Similar News
News March 22, 2025
నారాయణపేట జిల్లాలో దారుణం.. భర్తను చంపిన భార్య

భూ వివాదం కారణంగా భర్తను భార్య చంపేసిన ఘటన నర్వలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లంకల గ్రామానికి చెందిన పాలెం అంజన్న(41) NRPT జిల్లాలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్య కొంత భూమిని అమ్మగా, మిగిలిన భూమి తన పేరుపై చేయలేదని కోపంతో భర్త మెడకు తాడు బిగించి చంపింది. రంగమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి అక్క పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని SI కురుమయ్య తెలిపారు.
News March 22, 2025
వనపర్తి: పెబ్బేర్లో యాక్సిడెంట్.. రేషన్ డీలర్ మృతి

రోడ్డు ప్రమాదంలో రేషన్ డీలర్ మృతిచెందిన ఘటన పెబ్బేర్ పరిధి అంబేడ్కర్ నగర్ రోడ్డు దగ్గర శుక్రవారం జరిగింది. SI హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాలు.. చెలిమిళ్లకు చెందిన రేషన్ డీలర్ హనుమంతు కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో వనపర్తి నుంచి పెబ్బేర్కు చేరుకుని బస్సు దిగే క్రమంలో కిందపడి మృతిచెందాడు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
News March 22, 2025
చిత్తూరు: ఒకరి ప్రాణం కాపాడిన SI

చిత్తూరు జిల్లాలో ఓ ఎస్ఐ ఒకరి ప్రాణం కాపాడారు. యాదమరి మండలం జోడిచింతలకు చెందిన ఓ వ్యక్తి లోన్ తీసివ్వాలని తల్లిని కోరాడు. కొన్ని రోజుల తర్వాత తీసిస్తానని ఆమె చెప్పింది. ‘నేనంటే నీకు ఇష్టం లేదు. నేను చనిపోతున్నా అమ్మ’ అంటూ అతను తల్లికి వీడియో పెట్టి ఫోన్ స్విచాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఈశ్వర్ యాదవ్ టెక్నాలజీ ఉపయోగించారు. మందు తాగి పడిపోయిన వ్యక్తిని హాస్పిటల్కు తరలించి ప్రాణాలు కాపాడారు.